ట్రెండింగ్ న్యూస్ - Trending News

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

ఉన్న ఓట్లను తొలగించకుండా నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ఓటును వి నియోగించుకోవటానికి అవకాశం కల్పించిన టీడీపీకి చెందిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్స్) లు చేసిన కృషి ప్రశంసనీయమని పార్టీకీ వారే పునాదులని టీడీపీ మండల అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి అన్నారు .. మండ ల కేంద్రమైన రెంటచింతలలోని మానస నర్సరీలో మండల స్థాయి బీఎల్ ఏల విస్తృత స్థాయి సమావేశంలో అబ్బిరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహం, ఊపుతో ముందుకెళ్ళాలని కోరారు.గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుని అక్రమ కే సులు బనాయించి భయభ్రాంతులకు గురిచేశారు, ఈ సమావేశంలో గొట్టు సుమంత్ రెడ్డి, రామకృష్ణ, నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

వర్షాకాలం ప్రారంభమైనందున ఎగువన వున్న నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటిక ప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్ తిరుమల ప్రసాద్ ఇంజనీరింగ్ సి బ్బందిని ఆదేశించారు. గురువారం సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. క్రస్ట్ గేట్లు, రిజర్వాయర్లో వున్న నీటి నిల్వ,మెయిన్ డ్యాం, పవర్ హౌస్లోని టర్తైయిన్లను తనిఖీ చేశారు. ఎస్ఈ ,కె. వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు,ఈఈ, గోదావరి శ్రీనివాస్, ఏడీఈలు అబ్దుల్ మతిన్, జయశంకర్, నిరంజన్, మల్లేష్, కోటేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు

| 📍 ఆంధ్రప్రదేశ్ |

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు (CBI Raids) నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!

| 📍 Vizag, ఆంధ్రప్రదేశ్ |

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో రవాణా, పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం

| 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్ |

విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ వద్ద సూట్‌కేసులో లభ్యమైన మృతదేహాన్ని విశాఖకు చెందిన యువతి సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

📢 Advertisement Space - Google AdSense
దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!

| 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్ |

శుక్రవారం ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో దర్శి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీవో విజయ జ్యోతి తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. కార్యక్రమానికి సహకరించిన గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావుకు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

📢 Advertisement Space - Google AdSense
గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 30 Jul 2026 RMB

గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, మండలంలోని రెంటాల గ్రామ రైతు సింగు వెంకయ్యకు చెందిన గోమాత
ఒకే కాన్పులో రెండు కోడేదూడలకు జన్మనిచ్చి అందర్ని అబ్బురపరిచింది. ఈఘటన గ్రామంలో అందరికి తెలియడడం తో గ్రామస్తులంతా ఆ లేగ దూడలను చూసేందకు క్యూ కట్టారు. అనంతరం గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు చే శారు. ఇటీవలి కాలంలో అరుదైన సంఘటన జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పశువైద్యాధికారులు డా క్టర్ దీపక్ నాగార్జున, సహాయకులు భాస్కర్, రమేష్ నాయక్ గోమాత సుఖమయ ప్రసవానికి దగ్గరుండి ప్రత్యేక వైద్యం అందించారు.

📢 Advertisement Space - Google AdSense
వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 30 Jul 2026 RMB

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం

| 📍 Kadapa, ఆంధ్రప్రదేశ్ |

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ రేపు పులివెందులకు వెళ్లనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు.

📢 Advertisement Space - Google AdSense
దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 30 Jul 2026 RMB

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!

| 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్ |

రేపు ముండ్లమూరులో భారీ స్థాయిలో ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమం జరగనుంది!జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు!
మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం!

📢 Advertisement Space - Google AdSense
ఏపీలో వర్షాలు.. 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 30 Jul 2026 RMB

ఏపీలో వర్షాలు.. 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

| 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్ |

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వాతావరణం మారే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 28 Jul 2026 RMB

ఏపీలో వర్షాభావ పరిస్థితులు.. ఖరీఫ్‌పై ప్రభావం

| 📍 AP, ఆంధ్రప్రదేశ్ |

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 28 Jul 2026 RMB

ఏపీలో భారీ వర్షాలకు అవకాశం

| 📍 AP, AP, ఆంధ్రప్రదేశ్ |

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

📢 Advertisement Space - Google AdSense
ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 26 Jul 2026 RMB

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

: తొలి ఏకాదశి పర్వదినం ముగిసిన తరువాత ఆషాఢ మాసాన్ని పురస్కరిం
చుకుని ఆదివారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సారే సమర్పించారు. మేజర్ పంచాయతీ రెంటచింతల ఆంజనేయస్వా మి మాణ్యానికి చెందిన భక్తులంతా ఎర్రటి ఎండలో తల్లికి బోనాలు సమర్పించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.ము ఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చీర, సారె, పసుపు, కుంకుమ అందించారు. కరువు దరి చేరకూ డదని పాడి పంటలతో గ్రామాలు తులతూగాలని వరుణ దేవుడు కరుణించాలని వేడుకున్నారు. చల్లంగ దీవించాలని క రుణ కటాక్షాలు కుమ్మరించాలని ప్రార్ధించారు. పూజారి శ్రిష్టి శ్రీనివాస శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక అలంకా రాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

📢 Advertisement Space - Google AdSense
పంటలకు బీమా చేయించుకోవాలి..ఏవో కట్టా లక్ష్మారెడ్డి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 26 Jul 2026 RMB

పంటలకు బీమా చేయించుకోవాలి..ఏవో కట్టా లక్ష్మారెడ్డి

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల...ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించి పంటలు నష్టపోయే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని నమోదు చేసుకోవాలని ఏవో కట్టా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం సాగు పరిస్థితులపై మాట్లాడుతూ బ్యాంక్. నుండి పంట రుణం తీసుకున్న వారికి బ్యాంక్ వారు బీమా ప్రీమియం చెల్లిస్తారని రుణం తీసుకోని రైతులు తమ ఆధా ర్ కార్డు, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, పంట ధృవపత్రాన్ని తీసుకుని ఆగస్టు 15వ తేదీ లోపు ప్రీమియం చెల్లించుకో వాలన్నారు. ఈయన వెంట ఏఈఏ రాంబాబునాయక్ తదితరులున్నారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 25 Jul 2026 RMB

రూ.73 కోట్ల ధాన్యం గోల్‌మాల్

| 📍 Suryapet, తెలంగాణ |

సూర్యాపేట జిల్లా బాలెంలలోని వజ్ర రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యం మాయమైనట్లు తేలింది. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, మిల్లులోని నిల్వలను సీజ్ చేశారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 25 Jul 2026 RMB

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ

| 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్ |

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైంది. అయితే ఇందులో అడ్రస్ లేని వారు 44,89,488 మంది, మరణించిన వారు 15,22,174 మంది, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు 14,43,886 మంది ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు. అలాగే కొత్తగా 7,37,216 మంది ఓటర్లు నమోదయ్యారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 25 Jul 2026 RMB

సహోద్యోగిని అతి కిరాతకంగా పొడిచి చంపిన యువకుడు!

| 📍 UP, UP, ఉత్తర ప్రదేశ్ |

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడనే కక్షతో ఓ యువకుడు తన సహోద్యోగిని కత్తితో పొడిచి హత్య చేశాడు. బరేలీకి చెందిన సురేశ్, అదే కంపెనీలో పనిచేస్తున్న బాబీతో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నరేశ్ మధ్య వివాదం ముదరడంతో ఈ ఘోరం జరిగింది. బాబీతో సురేశ్ ఎక్కువగా మాట్లాడటం సహించలేకపోయిన నరేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

📢 Advertisement Space - Google AdSense
పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 24 Jul 2026 RMB

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

మండాది గ్రామం, వెల్దుర్తి మండలం, .జక్కిరెడ్డి అంజిరెడ్డి (వయస్సు 40 సంవత్సరాలు), వృత్తిరీత్యా రైతు.: అడవి పందుల నివారణ కోసం పక్క పొలంలో ఏర్పాటు చేసిన కరెంటు తీగను ప్రమాదవశాత్తూ గురువారం రాత్రి తన స్వంత పొలంలోని ఆటోమేటిక్ మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణ సంఘటన జరిగింది.: కరెంట్ షాక్ తగలడం వల్ల అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.: ఇదే ప్రమాదంలో మరొక వ్యక్తికి కూడా విద్యుత్ షాక్ తగిలినప్పటికీ, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

📢 Advertisement Space - Google AdSense
తొలి ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులసమావేశం
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 24 Jul 2026 RMB

తొలి ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులసమావేశం

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సత్ర శాలలోని శ్రీగంగాభ్రమరాంబ సమేత మల్లిఖార్జు నస్వామి సన్నిధిలో ఈ నెల 25న నిర్వహించ నున్న తొలి ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ జీవీ శివయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. సమావేశంలో తహసీల్దార్ మర్రి దీప్తి, రామిరెడ్డి, ఎస్ఐ సీహెచ్ నాగార్జున, డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి , ఏఈలు వెంకటేష్, మస్తాన్ వలి పాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
సచివాలయానికి తల్లికి వందనం జాబితా
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 23 Jul 2026 RMB

సచివాలయానికి తల్లికి వందనం జాబితా

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

మండల పరిధిలోని ఆయా స్వర్ణ గ్రామ సచివాలయాల్లో తల్లికి వందనం ఆర్హులు, అనర్హులు జాబితాను
బహిరంగంగా నోటీస్ బోర్డ్లో అతికించినట్లు ఎంఈవో 2 శివనాగేశ్వరరావు చెప్పారు. జాబితాను పరిశీలించి రాని వారుంటే పాఠశాల హెచ్ఎంను సం ప్రదించాలన్నారు. బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్ సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలన్నారు. సాంకేతిక కారణాలతో నగదు ఆగిపోతే వెంటనే మీ పరిధిలోని సచివాలయ అధికారులతో సంప్రదించాలన్నారు.

📢 Advertisement Space - Google AdSense
తల్లికి వందనం ఒకే ఇంటికి రూ. 78వేలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 23 Jul 2026 RMB

తల్లికి వందనం ఒకే ఇంటికి రూ. 78వేలు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

AP: ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా 'తల్లికి వందనం' స్కీమ్ అమలు చేస్తుండటంతో పలు కుటుంబాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు సంతానం కాగా రూ.78వేలు అందాయి. నెల్లూరు, పల్నాడు, శ్రీసత్యసాయి ఇలా చాలా జిల్లాల్లో ఐదుగురు పిల్లలు ఉన్నవారికి రూ.65వేలు జమయ్యాయి. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో దశలో డబ్బులు అందనున్నాయి.

📢 Advertisement Space - Google AdSense
కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 23 Jul 2026 RMB

కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

కోవిడ్.పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోలి పీహెచ్ సీ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు బుధవారం ఏఎన్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు ప్రజలుజాగ్రత్తగా మాస్క్ లు దరించాలన్నారురాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యం లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చేతులు పరిశుభ్రత, శ్వాసకోశ పద్ధతులను పాటిస్తూ అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో వున్నాయన్నారు. 3129 మార్చి 22 నుంచి కరోనా విజ్బంట్ స్తుండడంతో మండల వ్యాప్తంగా 32 మంది మరణించగా అందులో ఓ బ్యాంక్ క్యాషియర్ కూడా వున్నారు.

📢 Advertisement Space - Google AdSense
గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 23 Jul 2026 RMB

గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.8 కోట్లతో 11 గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ ల నిర్మాణం ప్రారభమైనట్లు ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెన్ను వెంకటేష్ చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ ఓక్కో ఓవర్ హెడ్ ట్యాంక్ 40 వేల లీటర్ల స్థాయి నుంచి 2.50 లక్షల లీటర్ల సామర్థ్యంగల ట్యాం క్ నిర్మాణం జరుగుతుందన్నారు. రెంటచింతలకు 2, తుమృకోట 2, మంచికల్లు 2,రెంటాల 1, కొత్తగంగరాజు పల్లె 1,పాలువాయి 1,కొత్త పాలువాయి 1, పాలువాయిగేట్ 1, మిట్టగుడిపాడు 1, గోలి 1, మల్లవరం 1,పశర్లపాడు 1 మొత్తం 15 ట్యాంక్ నిర్మాణం పనులు ప్రారం భమయ్యాన్నారు

📢 Advertisement Space - Google AdSense
‘తల్లికి వందనం’ నిధుల విడుదల
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 22 Jul 2026 RMB

‘తల్లికి వందనం’ నిధుల విడుదల

| 📍 ఆంధ్రప్రదేశ్ |

ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదల ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. చదువు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఆశయంతో ప్రభుత్వం తొలి విడత కింద 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15,000 కేటాయించగా, పాఠశాలల నిర్వహణ నిధి కింద రూ.2,000 మినహాయించి మిగిలిన రూ.13,000 నగదును తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తింపజేస్తుండటంతో గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా చేరిన విద్యార్థులకు ఆగస్టు 30న రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం దీనికోసం మొత్తం రూ.10,121 కోట్లు వెచ్చిస్తోంది.

📢 Advertisement Space - Google AdSense
వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

జీతాలు పెంచాలని, శాశ్వితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులివ్వాలని, ప్రమాద బీమా క ల్పించాలని, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీప్స్ మంజూరు చేయాలని కోరుతూ మల్టీపర్పస్ ఎక్స్టెటెన్షన్ ఆఫీసర్లు మంగళవారం నుంచి పెన్ డౌ న్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డికి రాతపూర్వకంగా అభ్యర్ధనను అందించారు. ఈసందర్భంగా యూనియన్ నేత ఆ నిల్ మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనంతో బాధ్యతలు నిర్వహిస్తున్నామని అయినా తమ జీవితాల్లో ఎలాంటి పురోగతి లే దని వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంబాబునాయక్,ఆంజినాయ క్; లింగానాయక్,పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ

| 📍 Rentachintala, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

మండలంలోని మంచికల్లు గ్రామానికి చెందిన నెవలి లింగారెడ్డి
పొలంలో వున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ అపహరణకు గురైంది. వర్షాలు లేక బోర్ ద్వారా వరి సాగు చేస్తున్నతరు ణంలో చోరీలు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.12 వేల వరకు నష్టం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున చెప్పారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

మంత్రాలయం: కారు ప్రమాదంలో వ్యక్తి మృతి!

| 📍 Kurnool, ఆంధ్రప్రదేశ్ |

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం కుటుంబంతో కలిసి బయలుదేరిన రవిశెట్టి (43) అనే వ్యక్తి ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. బాధితులు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవిశెట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

📢 Advertisement Space - Google AdSense
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రచారంపై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రచారంపై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!

| 📍 Mumbai, మహారాష్ట్ర |

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ 138 పరుగులతో అద్భుత సెంచరీ బాది విమర్శకుల నోళ్లు మూయించాడని గుర్తుచేశాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్, విరాట్‌లను జట్టు నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదని, వారు ఇంకా భారత జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ స్పష్టం చేశాడు.

📢 Advertisement Space - Google AdSense
రెంటచింతలో ఇరువురు ఘర్షణ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

రెంటచింతలో ఇరువురు ఘర్షణ

| 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల,: మాచర్ల-దాచేపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహనాయక్‌కు, రెంటచింతల మండలం గోలికి చెందిన నాగేశ్వరరావు బంధువులకు కాలువ నీటి సరఫరా వ్యవహారంలో వివాదం ఉంది. ఓ రెస్టారెంట్ వద్ద టీ తాగుతూ కాలువ వ్యవహారాలపై చర్చిస్తుండగా వివాదం చెలరేగింది. నరసింహనాయక్ వర్గీయులు దాడి చేయడంతో నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తలలకు గాయాలయ్యాయి. వారిని గురజాల వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు.

📢 Advertisement Space - Google AdSense
చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 21 Jul 2026 RMB

చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!

| 📍 ఢిల్లీ |

నటి అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ గత మూడేళ్లుగా రహస్య ప్రేమాయణం నడిపి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల నడుమ, ధ్రువ్ వైఖరి నచ్చక వారిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తి హఠాత్తుగా విడిపోయారనే ప్రచారం కోలీవుడ్, టాలీవుడ్‌లలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది; చివరిసారిగా కలుసుకున్న సమయంలో జరిగిన తీవ్ర వాగ్వాదంలో అనుపమ కోపంతో ధ్రువ్‌ను చెప్పుతో కొట్టి మరీ బ్రేకప్ చెప్పేసిందనే రూమర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతుండగా, ఈ ఘోరమైన బ్రేకప్ డ్రామాపై ఇప్పటివరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

గాయపడిచికిత్సపొందుతున్న పికిలి బాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే

| 📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్ |

మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.

📢 Advertisement Space - Google AdSense
గాయపడి  చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

గాయపడి చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే

| 📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్ |

మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.

📢 Advertisement Space - Google AdSense
పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్

| 📍 సంగారెడ్డి, తెలంగాణ |

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం చింతలగట్టు గ్రామంలో శాంతి ఫౌండేషన్; ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ మరియు శాంతి ఫౌండేషన్ చైర్మన్ అయిన సిద్దు రావణ్.. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని దర్గా, చర్చి, పోచమ్మ దేవాలయాలను సందర్శించి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచారు. మన ఊరు - మన బిడ్డ అనే కార్యక్రమంలో భాగంగా, తన తల్లి శాంతమ్మ గారి జ్ఞాపకార్థం సిద్దు రావణ్ ఈ కార్యక్రమాలను చేపట్టారు. కోల్పోయిన దాని విలువ పోగొట్టుకున్న వారికే తెలుస్తుందని, కన్నతల్లి ఆశయాలను నెరవేర్చడమే నిజమైన విజయం అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. దానం చేసే చేతులే సమాజానికి నిజమైన సంపద అని పేర్కొంటూ.. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందజ

📢 Advertisement Space - Google AdSense
బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య

| 📍 కారంపూడి, ఆంధ్రప్రదేశ్ |

కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రేబ్బరపల్లి పెద్ద వెంకటయ్య కుటుంబానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య రూ. 20000 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం కారంపూడి లోని ఆర్&బి బంగ్లాలో వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

TG: గోదావరి కాలుష్యంపై పూర్తి స్థాయి ఆడిట్‌

| 📍 తెలంగాణ |

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

ED: భూదాన్ స్కామ్‌లో ఈడీ విచారణకు ఐఏఎస్

| 📍 ఆంధ్రప్రదేశ్ |

భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

| 📍 ఆంధ్రప్రదేశ్ |

హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్

📢 Advertisement Space - Google AdSense
ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

| 📍 AP, ఆంధ్రప్రదేశ్ |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (సోమవారం) వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రధాన జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

📢 Advertisement Space - Google AdSense
రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

| 📍 పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

నరసరావుపేట:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం (జూలై 20) జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, సచివాలయ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అన్ని కేంద్రాల్లో కొత్తగా 'ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ (QR) కోడ్'ను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యాలయాలకు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, *meekosam.ap.gov.in* వెబ్‌సైట్ లేదా వాట్సప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 (దీని ద్వారా 300కు పైగా సేవలు లభ్యం) ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.

📢 Advertisement Space - Google AdSense
ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి

| 📍 Rentachintala, ఆంధ్రప్రదేశ్ |

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలతో విద్యార్థులు జీవితా ల్లో వెలుగు ప్రసరిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని టీడీపీ రెంటచింతల టౌన్ అధ్యక్షులు ఎం. రాజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహంలో ఉండే స్టూడెంట్స్ కు దుప్పట్లు, ప్లేట్లు, స్వెట్టర్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వార్డెన్లు బేగ్, అరుణుమారిలు అధ్యక్షత వహించార . గురజాల ఏఎస్ డబ్ల్యువో టీవీ.సుజాత కుమారి మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నగదు జమౌతుందని చదువుకే వాడుకోవాలని నొక్కి చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలన్నారు..ఈ కార్యక్రమంలో పీ హెచ్సీ చూజీ చైర్మన్ బి.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున

| 📍 ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, ఆర్ అండ్ బి రహదారిని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు అలాగే మైక్ పెట్టి రణగొణధ్వనులు సృష్టించే వారికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తనదైన శైలిలో సుతిమెత్తంగా హెచ్చరించారు.రహ దారికివీరువైపులా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ దాటి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదే పనిగా చిన్న స్పీకర్ల తో ధ్వని కాలుష్యం చేస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్కు అంతరాయడం కలిగించొద్దన్నారు. రహదారి విస్తరించడం వల్ల ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోవాలే కాని ఇష్టారాజ్యంగా ట్రాఫిక్కు పండ్ల బళ్లను అడ్డుపెడితే ఊరు కునేది లేదన్నారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ఆజాద్ పార్టీ తెలంగాణ స్టేట్ సీనియర్ లీడర్స్ సిద్దు రావణ్

| 📍 సంగారెడ్డి, తెలంగాణ |

ఆజాద్ పార్టీ జహీరాబాద్ కాంసెన్సీ సీనియర్ నాయకుడు సిద్దు రావ ణ్. జహీరాబాద్ మండల్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి జులై 19
ఆజాద్ పార్టీ కన్వీనర్ గా అధ్యక్షుడిగా నియమితులైన సిద్దు రామన్ గారు

📢 Advertisement Space - Google AdSense
మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

| 📍 Delhi, ఢిల్లీ |

హిందూ మతం విడిచి క్రైస్తవం లేదా ఇతర మతాలు స్వీకరించిన వ్యక్తులకు రాజ్యాంగపరమైన ఎస్సీ (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో 2021లో జరిగిన ఒక దాడి కేసుకు సంబంధించి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతం స్వీకరించినందున అతనికి ఈ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా, అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అవకాశం ఉండదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది.

📢 Advertisement Space - Google AdSense
జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం

| 📍 ఢిల్లీ |

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది.

📢 Advertisement Space - Google AdSense
ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

| 📍 Pendurthi, ఆంధ్రప్రదేశ్ |

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.

📢 Advertisement Space - Google AdSense
విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

| 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్ |

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి

| 📍 delhi, ఢిల్లీ |

వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 22 ప్రకారం ‘క్లాస్‌-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్‌-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్‌-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి ఉంటారు. ఎలాంటి వీలునామా రాయని సందర్భంలో వారసత్వ ఆస్తిని పొందే తొలి హక్కు వారికి ఉంటుంది. 22వ సెక్షన్‌ స్థిరాస్తు లు, వ్యాపారాలకు వర్తిస్తుంది.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

| 📍 Delhi, ఢిల్లీ |

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

📢 Advertisement Space - Google AdSense
గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!

| 📍 Polavaram, ఆంధ్రప్రదేశ్ |

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వారికి తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

vcxvbcxcvb

| 📍 ఆంధ్రప్రదేశ్ |

vcbvcbvcb

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

fsbcvbvcb

| 📍 ఆంధ్రప్రదేశ్ |

vcbvcbvcb

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

fsbcvbvcb

| 📍 ఆంధ్రప్రదేశ్ |

vcbvcbvcb

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?

| 📍 Amaravati, ఆంధ్రప్రదేశ్ |

బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

హైదరాబాద్‌లో భారీ వర్షం - రోడ్లు జలమయం

| 📍 Hyderabad, తెలంగాణ |

హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం

| 📍 Delhi, ఢిల్లీ |

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీ సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దేశవ్యాప్తంగా సంబరాలు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

ఏఐ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవం

| 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్ |

కృత్రిమ మేధస్సు సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. పంటల పర్యవేక్షణ, నీటి నిర్వహణ, కీటకాల గుర్తింపు వంటి పనులు ఏఐ ద్వారా సులభంగా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

ఎన్నికల ఫలితాలు - కాంగ్రెస్ హ్యాట్రిక్

| 📍 Bengaluru, కర్ణాటక |

తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

📢 Advertisement Space - Google AdSense