ఆరోగ్యం - తాజా వార్తలు

RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

గాయపడిచికిత్సపొందుతున్న పికిలి బాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే

| 📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్ |

మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.

📢 Advertisement Space - Google AdSense
ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి

| 📍 Rentachintala, ఆంధ్రప్రదేశ్ |

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలతో విద్యార్థులు జీవితా ల్లో వెలుగు ప్రసరిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని టీడీపీ రెంటచింతల టౌన్ అధ్యక్షులు ఎం. రాజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహంలో ఉండే స్టూడెంట్స్ కు దుప్పట్లు, ప్లేట్లు, స్వెట్టర్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వార్డెన్లు బేగ్, అరుణుమారిలు అధ్యక్షత వహించార . గురజాల ఏఎస్ డబ్ల్యువో టీవీ.సుజాత కుమారి మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నగదు జమౌతుందని చదువుకే వాడుకోవాలని నొక్కి చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలన్నారు..ఈ కార్యక్రమంలో పీ హెచ్సీ చూజీ చైర్మన్ బి.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున

| 📍 ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, ఆర్ అండ్ బి రహదారిని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు అలాగే మైక్ పెట్టి రణగొణధ్వనులు సృష్టించే వారికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తనదైన శైలిలో సుతిమెత్తంగా హెచ్చరించారు.రహ దారికివీరువైపులా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ దాటి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదే పనిగా చిన్న స్పీకర్ల తో ధ్వని కాలుష్యం చేస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్కు అంతరాయడం కలిగించొద్దన్నారు. రహదారి విస్తరించడం వల్ల ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోవాలే కాని ఇష్టారాజ్యంగా ట్రాఫిక్కు పండ్ల బళ్లను అడ్డుపెడితే ఊరు కునేది లేదన్నారు.

📢 Advertisement Space - Google AdSense