జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది.
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది.
ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.
ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.
వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 22 ప్రకారం ‘క్లాస్-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి ఉంటారు. ఎలాంటి వీలునామా రాయని సందర్భంలో వారసత్వ ఆస్తిని పొందే తొలి హక్కు వారికి ఉంటుంది. 22వ సెక్షన్ స్థిరాస్తు లు, వ్యాపారాలకు వర్తిస్తుంది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వారికి తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
vcbvcbvcb
vcbvcbvcb
vcbvcbvcb
బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీ సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దేశవ్యాప్తంగా సంబరాలు.
కృత్రిమ మేధస్సు సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. పంటల పర్యవేక్షణ, నీటి నిర్వహణ, కీటకాల గుర్తింపు వంటి పనులు ఏఐ ద్వారా సులభంగా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.