
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ
చింతలపాలెం: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసిల్దార్ బి. రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఆత్రేయ, సీనియర్ అసిస్టెంట్ రంగారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.