Generating...

🔐 Admin Login

RMB LIVE NEWS - తెలుగు షార్ట్ న్యూస్

📺 YouTube Shorts

Nani
Nani Paradise
RMB News
Irumudi Director Shiva Nirvana
NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
తల్లికి వందనం 2వ విడత ఎప్పుడు? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తల్లికి వందనం 2వ విడత ఎప్పుడు? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం 2వ విడత నిధుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా RTE చట్టం పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు అసలు నిధులు జమ కాలేదని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 2వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? అర్హులైన ప్రతి కుటుంబానికి డబ్బులు అందేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారిక ప్రకటన కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెంటచింతల: 1,560 కొత్త పింఛన్ దరఖాస్తులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రెంటచింతల: 1,560 కొత్త పింఛన్ దరఖాస్తులు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలంలో 1,560 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో స్వరూపరాణి తెలిపారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతర కేటగిరిలు ఉన్నారు.పరిశీలన :ఈ రోజు నుండి 21 వరకు: సాధారణ అర్హత పరిశీలన22 నుండి 24 వరకు: భౌతిక, శాఖాపరమైన తనిఖీలు25, 26 తేదీల్లో: బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదంఅన్ని స్థాయిల్లో తనిఖీలు పూర్తయ్యాక ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తుంది.

🔥 BIG BREAKING: వినాయక నిమజ్జనాల్లో DJ సౌండ్‌కు అనుమతి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

🔥 BIG BREAKING: వినాయక నిమజ్జనాల్లో DJ సౌండ్‌కు అనుమతి

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే సౌండ్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని నారా లోకేష్ చేసిన విజ్ఞప్తిపై హోంమంత్రి అనిత స్పందించినట్లు సమాచారం. నిమజ్జన కార్యక్రమాల్లో డీజే సౌండ్ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై వినాయక ఉత్సవాల నిర్వాహకుల్లో ఆసక్తి నెలకొంది.

పోలింగ్ బూత్ల మార్పుకు  తాహశీల్దార్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పోలింగ్ బూత్ల మార్పుకు తాహశీల్దార్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎంపీటీసీ 2 కు సంబంధించి ఎల్ఎల్ఆర్ స్కూల్లో ఏర్పాటు చే సిన 36,39 పోలింగ్ బూత్లను మార్చాలని కోరుతూ టీడీపీ నేతలు ఎంపీడీవో స్వరూపరాణికి వినతిని అందచేశారు. ఈ రెండు బూత్లను వైఆర్ఎస్ హైస్కూల్లోకి మార్చాలని కోరారు. కలెక్టర్ అప్రూవల్కు పంపామని శనివారం తుది నిర్ణయం వెల్లడవుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: భారీ రక్తదాన శిబిరం ఏర్పాటువేడుకలు:
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: భారీ రక్తదాన శిబిరం ఏర్పాటువేడుకలు:

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రెంటచింతల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.రక్తదాన శిబిరం: సమాజ సేవలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరానికి స్థానిక యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు.ముఖ్య అతిథులు: పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, మండల పార్టీ అధ్యక్షుడు ఇంగుటూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివణ పథకం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివణ పథకం

| 🌐 Telugu | 📍 Zhyerabad, Sangareddy, తెలంగాణ

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివర్ణ పతాకం
జహీరాబాద్, ఆర్ ఎం బి న 17
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొనిగురువారం ఉదయం జహీరాబాద్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ సి. విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారత దేశానికి స్వాతంత్రంసిద్దించిన పిమ్మట సెప్టెంబర్ 17, 1948 న హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనమైందని, రజాకారుల దాస్య శృంఖలాలనుండి వేరు చేసి అప్పటి భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు విముక్తిని కలిగించిందన్నారు. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 న

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ

| 🌐 Telugu | 📍 Chinthalapalem, సూర్యాపేట, తెలంగాణ

చింతలపాలెం: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసిల్దార్ బి. రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఆత్రేయ, సీనియర్ అసిస్టెంట్ రంగారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గణేష్ లడ్డు,4.50 లక్షలకు కైవసం చేసుకున్న టీడీపీ నేత గొట్టు, ఆదిరెడ్డి, కుటుంబం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గణేష్ లడ్డు,4.50 లక్షలకు కైవసం చేసుకున్న టీడీపీ నేత గొట్టు, ఆదిరెడ్డి, కుటుంబం

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల , కేంద్రమైన(ఆనందపేట), సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా 50 కేజీల లడ్డుతో పాటు 10 గ్రాముల బంగారు లాకెట్ను వేలం వేశారు.: తీవ్ర పోటీ మధ్య సీనియర్ టీడీపీ నాయకుడు గొట్టు ఆదిరెడ్డి కుటుంబం రూ. 4.50 లక్షలకు ఈ లడ్డును దక్కించుకుంది.వేడుకలు: బుధవారం రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణసంచా కాల్పుల మధ్య విఘ్నేశ్వరుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును స్వామివారి సేవలకు, అన్నదాన కార్యక్రమానికి నిర్వహించారు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం.. 359 ఉద్యోగాల కల్పన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం.. 359 ఉద్యోగాల కల్పన

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తాజాగా 25 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ శాఖల్లో ఇప్పటివరకు 359 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ప్రత్యేక కేసుల కింద మరో 35 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు.

రేపు వారాణసికి సీఎం చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రేపు వారాణసికి సీఎం చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

రేపు సీఎం చంద్రబాబు నాయుడు వారాణసిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ‘వారాణసి–వడ్న్‌గర్‌ సేవా సంకల్ప్‌ యాత్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5 గంటలకు వారాణసి నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు.

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. బీసీ రిజర్వేషన్ల పెంపుతో కొత్త సందేహాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. బీసీ రిజర్వేషన్ల పెంపుతో కొత్త సందేహాలు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచే అంశంపై ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు, పంచాయతీరాజ్ చట్టం, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత కోసం రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం

| 🌐 Telugu | 📍 Eluru, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆళ్ల నాని మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజకీయ రంగంలో ఆయనతో అనుబంధం ఉన్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పులగం బండ తండలో ఘనంగా వినాయక చవితి పూజలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పులగం బండ తండలో ఘనంగా వినాయక చవితి పూజలు

| 🌐 Telugu | 📍 నేరేడుచర్ల, సూర్యాపేట, తెలంగాణ

నేరేడుచర్ల మండలం పులగం బండ తండలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కంటెస్టెంట్ పిల్లుట్ల రఘు అన్న పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి.
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి.

| 🌐 Telugu | 📍 సూర్యాపేట, సూర్యాపేట, తెలంగాణ

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఈరోజు సూర్యాపేట ఎస్పీ నరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని తెలియజేశారు.

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

| 🌐 Telugu | 📍 వెల్దుర్తి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం తన సొంత గ్రామమైన కండ్లకుంటలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారి విగ్రహాన్ని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

🙏 దర్శి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. Dr.గొట్టిపాటి లక్ష్మి - కడియాల లలిత్ సాగర్ 🎉
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

🙏 దర్శి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. Dr.గొట్టిపాటి లక్ష్మి - కడియాల లలిత్ సాగర్ 🎉

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ TDP ఇన్‌చార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 🙏🐘🌺 #VinayakaChavithi #Darsi #TDP #GotthipatiLakshmi #KadialaLalithSagar #GaneshChaturthi

మల్లవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి: ఖాళీ కుండలతో ధర్నాకు సిద్ధమైన ప్రజలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మల్లవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి: ఖాళీ కుండలతో ధర్నాకు సిద్ధమైన ప్రజలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలం మల్లవరం గ్రామం ఎస్సీ కాలనీలో తాగునీటి మోటారు పాడైపోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.: చుక్క నీటి కోసం మహిళలు, వృద్ధులు కిలోమీటర్ దూరం నడిచి పక్క పొలాల వ్యవసాయ బోర్ల నుండి నీరు తెచ్చుకుంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి కొత్త మోటారు వేసి నీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఖాళీ కుండలతో ధర్నా చేస్తామని ఎస్ సి కాలనీ వాసులు హెచ్చరించారు

పొన్నూరులో మహిళ అనుమానాస్పద మృతి.. కుమార్తెపై బంధువుల ఆరోపణలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పొన్నూరులో మహిళ అనుమానాస్పద మృతి.. కుమార్తెపై బంధువుల ఆరోపణలు

| 🌐 Telugu | 📍 Ponnur, Guntur, ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా పొన్నూరులో 45 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. క్యాబిన్‌పేటకు చెందిన ఈవూరు లక్ష్మి తన కుమార్తె పుష్పతో కలిసి 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారని కుమార్తె చెబుతుండగా, ఆరోగ్యంగా ఉన్న ఆమె అకస్మాత్తుగా మరణించడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె తన ప్రియుడితో కలిసి లక్ష్మిని హత్య చేసి ఉండవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మల్లవరంలో తాగునీటి ఎద్దడి: మోటార్ రిపేర్ చేయిస్తామని ఎంపీడీవో, హామీ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మల్లవరంలో తాగునీటి ఎద్దడి: మోటార్ రిపేర్ చేయిస్తామని ఎంపీడీవో, హామీ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని మల్లవరం గ్రామం ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. తాగడానికి నీరు దొరక్క కాలనీవాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మదర్ ఫౌండేషన్ మల్లవరంఅధ్యక్షుడు జిల్లా బాబు రావు ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎంపీడీవో, స్వరూప రాణి కి రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో. గ్రామంలో పాడైపోయిన బోర్ త్రీ ఫేస్ మోటార్‌ను తక్షణమే రిపేర్ చేయించి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా సాగర్, కిషోర్, బాబు, ఏసోబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

రేపుమార్కండేశ్వర మందిరంలో 224 వ నగర సంకీర్తన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రేపుమార్కండేశ్వర మందిరంలో 224 వ నగర సంకీర్తన

| 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

రేపు మార్కండేశ్వర మందిరంలో 224వ నగర సంకీర్తన
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 11
శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 13న 224 వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6-15 గంటలకు హరేకృష్ణ మహామంత్ర జపం, శ్రీల ప్రభుపాదుల వారి ప్రార్థన గీతం, రసరమ్య కీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్ర, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర నిర్వహణ బాధ్యులు శ్రీ విభీషణ దాస ప్రభుజీ ద్వారా భగవద్గీతపై అనుగ్రహ భాషణం, నరసింహ ఆరతి, ప్రసాద విత

ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి!

| 🌐 Telugu | 📍 హుజూర్నగర్, సూర్యాపేట, తెలంగాణ

స్థానిక పాత బస్టాండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మకు గౌరవంగా ట్యాంక్ బండ్‌పై ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని చాకలి ఐలమ్మ యువసేన కన్వీనర్ ఇందిరాల పిచ్చయ్య రజక అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, ఐలమ్మ విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రశాంత‌ వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి ఎస్సై పరమేష్ ‌
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రశాంత‌ వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి ఎస్సై పరమేష్ ‌

| 🌐 Telugu | 📍 చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ

చింతలపాలెం పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్సై పరమేష్ సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు ‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత‌ వాతావరణం లో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ నిర్వాహకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు‌.

అంకిత భావానికి దక్కిన గౌరవం.. మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లకు జిల్లాస్థాయి ఉత్తమ సేవా పురస్కారం..
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

అంకిత భావానికి దక్కిన గౌరవం.. మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లకు జిల్లాస్థాయి ఉత్తమ సేవా పురస్కారం..

| 🌐 Telugu | 📍 హుజూర్నగర్, సూర్యాపేట, తెలంగాణ

మున్సిపాలిటీలో15 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న మాధవరాయినిగూడెంకు చెందిన‌ టాక్టర్ డ్రైవర్ కాటబోయిన వెంకటేశ్వర్లుకు జిల్లాస్థాయిఉత్తమసేవ అవార్డులభించింది జిల్లా‌ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ ఆయనను సన్మానించి అభినందించారు పారిశుధ్య సేవల్లో వెంకటేశ్వర్లు అందిస్తున్న సేవలను కౌన్సిలరు‌ సహచార సిబ్బంది ప్రశంసించారు.

భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య

| 🌐 Telugu | 📍 Mahabubabad, తెలంగాణ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తకు చేసిన వీడియో కాల్‌కు స్పందన రాకపోవడంతో ఓ వివాహిత మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అనంతరం విషపదార్థం తీసుకున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Mahabubabad News, Telangana News

సిద్దేశ్వరాలయంలో ఘనంగా రుద్రాభిషేకం జహీరాబాద్ సెప్టెంబర్ 7
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

సిద్దేశ్వరాలయంలో ఘనంగా రుద్రాభిషేకం జహీరాబాద్ సెప్టెంబర్ 7

| 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

*సిద్దేశ్వరాలయంలో ఘనంగా రుద్రాభిషేకం*
జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 7
జహీరాబాద్ పట్టణం అల్గోల్ రోడ్డు లోని శ్రీ సిద్దేశ్వరాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.రుద్రాభిషేకం లో భాగంగా జహీరాబాద్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్ శేరి, 30 వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ అన్నపూర్ణ శేరి దంపతులు, పెద్ద లచ్చుగారి సుమలత రాజేష్ దంపతులతో పాటు శేరి శివాని పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. కుంకుమార్చనలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో

కోదాడలో బిఆర్ఎస్ నేతల ఆందోళన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

కోదాడలో బిఆర్ఎస్ నేతల ఆందోళన

| 🌐 Telugu | 📍 కోదాడ, సూర్యాపేట, తెలంగాణ

అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళ ఎమ్మెల్యేల పట్ల అధికార పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంగళవారం కోదాడలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు *కోదాడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారి* ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యువకులు పాల్గొన్నారు.

ఘనంగా కాంగ్రెస్, సీపీఐ కుటుంబాల వనభోజనాలు.
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఘనంగా కాంగ్రెస్, సీపీఐ కుటుంబాల వనభోజనాలు.

| 🌐 Telugu | 📍 చింతలపాలెం, సూర్యాపేట, తెలంగాణ

నందిరెడ్డి ఇంద్రారెడ్డి, ఉస్తేల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం.చింతలపాలెం మండల కేంద్రంలో ముత్యాలమ్మ పండగ అనంతరం ఆనవాయితీగా నిర్వహించే వనభోజనాల కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నందిరెడ్డి ఇంద్రారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌, సీపీఐ కుటుంబాలు వనభోజనాలకు తరలివెళ్లాయి.

పులిచింతల ఆమరణ నిరాహార దీక్ష విరమణ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పులిచింతల ఆమరణ నిరాహార దీక్ష విరమణ

| 🌐 Telugu | 📍 చింతలపాలెం, సూర్యాపేట, తెలంగాణ

పులిచింతల జెన్కోలో కాంట్రాక్టు ఉద్యోగులు గత 25 రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ముగింపు పలికారు. పులిచింతల జెన్కో ఎస్సీ దేశ్యనాయక్ నిమ్మరసం ఇచ్చి ఉద్యోగులతో దీక్షను విరమింపజేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సమస్య పరిష్కారానికి సానుకూల స్పందన లభించడంతో ఉద్యోగులు దీక్ష విరమించారు.రేపటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు విధుల్లోకి చేరనున్నారు.

ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్

| 🌐 Telugu | 📍 Prakasam, Prakasam, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్: ద్రోణి ప్రభావంతో సోమవారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, అద్దంకి, చీమకుర్తి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, ఉలవపాడు, కరేడు తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్

| 🌐 Telugu | 📍 హుజూర్ నగర్, సూర్యాపేట, తెలంగాణ

హుజూర్ నగర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు 19 ఏళ్ల యువకులు కాంపాటి విరామ్ @ రాము, పాముల ఆకాష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు.ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ...
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ...

| 🌐 Telugu | 📍 మేళ్లచెరువు, సూర్యాపేట, తెలంగాణ

మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు పోతురాజుల పూనకాల నడుమ భారీ ఊరేగింపుగా వెళ్లిన భక్తులు ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు.పసుపులేటి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మహిళా భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనం చెల్లించడంతోపాటు మొక్కులను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు పసుపులేటి కుటుంబానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సభ్యులు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏసీబీ వలలో వెహికల్ ఇన్స్పెక్టర్.. రూ.2.48 లక్షలు స్వాధీనం!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏసీబీ వలలో వెహికల్ ఇన్స్పెక్టర్.. రూ.2.48 లక్షలు స్వాధీనం!

| 🌐 Telugu | 📍 Andhra Pradesh

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వెహికల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన వద్ద నుంచి రూ.2.48 లక్షల నగదు, కారును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

రెంటచింతలలో వెలవెలబోతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రెంటచింతలలో వెలవెలబోతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ఒకప్పుడు ప్రముఖులు చదువుకున్న రెంటచింతల మండల కేంద్రంలోని ఐదు బీసీ బాలుర, బాలికల వసతి గృహాలు ప్రస్తుతం విద్యార్థులు లేక ఖాళీగా మారుతున్నాయి.గతంలో ఇక్కడ సీటు కోసం సిఫార్సులు అవసరమయ్యేంత డిమాండ్ ఉండేది. మాజీ ఎస్పీ చాంద్ నాయక్ లాంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు, 1990లో గురజాల మాజీ ఎమ్మెల్యే దివంగత కాయితీ వెంకట నర్సిరెడ్డి ప్రత్యేక చొరవతో, అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి సహాయంతో ఈ హాస్టళ్లను ఏర్పాటు చేశారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను తహశీల్దార్ ఎం, దీప్తి. శనివారం పరిశీలించారు వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా 6,331 మందికి నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు కేవలం 408 మంది మాత్రమే స్పందించారు.స్థానిక సంస్థల ఎన్నికలు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని ఆమె నొక్కి చెప్పారు.

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకరించడంతో పాటు 2026 అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించనున్నారు. 2022 సరెండర్ లీవ్ బకాయిలను వచ్చే సంక్రాంతికి జమ చేయాలని నిర్ణయించారు. పోలీసులకు అదనపు సరెండర్ లీవ్‌ను దసరాకు చెల్లించనున్నారు. 2027 జనవరి నుంచి అదనపు పెన్షన్ అమలు, ఈహెచ్‌ఎస్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయాలతో ఏటా సుమారు రూ.2,880 కోట్ల అదనపు వ్యయం కానుంది.

దర్శిలో తాగునీటిలో పురుగులు?.. పట్టించుకోని అధికారులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

దర్శిలో తాగునీటిలో పురుగులు?.. పట్టించుకోని అధికారులు

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా దర్శిలో తాగునీటి నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నీటిలో పురుగులు, మలినాలు కనిపించాయని వారు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. నీటి నమూనాలను పరీక్షించి, సమస్యకు కారణాన్ని గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధులు వచ్చే ప్రమాదం.

కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, బాలకృష్ణుడు వేషధారణలు: శ్రీరామకృష్ణ గురుకులం చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో చేసిన కోలాటం, కృష్ణలీలలు పురవీధుల్లో అందరినీ ఆకట్టుకున్నాయి.స్వామివారి ఊరేగింపు: దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.ఉత్కంఠభరిత ఉట్లు: శ్రీరామకృష్ణా సేవా మండలి నేతృత్వంలో ఉష్ణస్తంభాల సెంటర్లో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతో ఆసక్తిగా సాగింది. శ్రీకృష్ణాదేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు భారీగా అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మంచికల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ రూ.40 లక్షలు మంజూరు చేసింది ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి దేవాదాయ శాఖకు 25 సెంట్ల స్థలాన్ని అప్పగించాల్సి ఉంటుంది . పశువేముల, బోదిలవీడు, పట్లవీడు గ్రామాల్లోని బీసీ, ఎస్టీ కాలనీల్లో కూడా స్థల సేకరణను బట్టి మరికొన్ని ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయించారు

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల,: మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరినట్లు ఎంఈవో-2 శివ నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం 6 ఎస్జీటీ 7 గురు స్కూల్ అసిస్టెంట్లు ఉద్యోగాల్లో చేరారని ఆయన తెలిపారు. అయితే, మల్లవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో హిందీ పోస్టుకు ఎవరూ ఎంపిక కాకపోవడం వల్ల, ఆ పోస్టు భర్తీ అనేది డీఈవో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

7వ తేదీన పల్లె ఓటర్ల జాబితా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

7వ తేదీన పల్లె ఓటర్ల జాబితా

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఈనెల 3వ తేదీ నుంచి చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు 6వ తేదీ వరకు నిర్వహించి ఎటువంటి అ భ్యంతరాలు లేవని నిర్ణయించాల్సి వుందని ఎంపీడీవో స్వరూపరాణి చెప్పారు. గ్రామ సభల ద్వారా ఓటర్ల తుది జాబితా ను 7వ తేదీన ఆయా గ్రామ సచివాలయాల నందు విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సర్ ప్రక్రియ చేపట్టక ముందు మండలంలోని 11 గ్రామాల్లో, 40674 మంది ఓటర్లున్నారన్నారు

నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ మర్రి దీప్తి పిలుపునిచ్చారు.ప్రత్యేక శిబిరాలు: మండల వ్యాప్తంగా సెప్టెంబరు 4, 5 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.కొత్త ఓటరు నమోదు: అర్హులు ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోల (BLO) వద్ద ఫారం-6 ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు, గౌతమ్ రెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు, గౌతమ్ రెడ్డి

| 🌐 Telugu | 📍 వెల్దుర్తి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

గొట్టిపాళ్ళ గ్రామంలో రాజబోయిన చిన్న మారకొండయ్య కుమారుడు శివ మారకొండయ్య వివాహ వేడుక లో పాల్గొన్న.ముఖ్య అతిథులు:జూలకంటి గౌతం రెడ్డి రాజబోయిన మధు యాదవ్ (మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్)కళ్ళం రామంజి రెడ్డి మరియు ఇతర అధికారులు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: కూటమి ప్రభుత్వ 'పల్లె పండుగ 3.0' లో భాగంగా పశువుల షెడ్ల (గోకులాలు) నిర్మాణానికి భూమి పూజ చేశారు.బడ్జెట్ , సబ్సిడీ: రైతురూ,20,000 చెల్లిస్తే, ప్రభుత్వం రూ,1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. మండల మొత్తానికి 18 గోకులాలు మంజూరయ్యాయి. రెంటచింతల, తుమ్మలకోటకు 3 చొప్పున.. జెట్టిపాలెం, గోలి మినహా మిగిలిన గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.ముఖ్య అతిథులు: టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్ అబిరెడ్డి, సీనియర్ నాయకుడు గొట్టు సుమంత్ రెడ్డి,ఎంపీడీవో స్వరూపరాణి అధికారులు పాల్గొన్నారు

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు  కోర్టులో లొంగిపోయాడు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలం పరిధిలోని రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో.. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరెడ్డి గురజాల కోర్టులో లొంగిపోయాడు.కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సవరణ(SIR)
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సవరణ(SIR)

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను తహశీల్దార్ ఎం. దీప్తి మాట్లాడుతూ:క్లెయిములు, అభ్యంతరాల గడువు: ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు.అభ్యంతరాల పరిష్కారం: అక్టోబరు 5 లోగా పూర్తి చేస్తారు.తుది ఓటర్ల జాబితా విడుదల: అక్టోబరు 9న అధికారికంగా ప్రకటిస్తారు.అర్హులైన ఓటర్లందరూ గడువు లోగా తమ వివరాలను పరిశీలించుకోవాలని కోరారు

పవన్ కళ్యాణ్‌పై శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పవన్ కళ్యాణ్‌పై శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ, ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్‌లోని మానవత్వం, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను గుర్తుచేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్‌డమ్‌కు అతీతంగా ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఈ పోస్ట్ ఆవిష్కరిస్తోంది.

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు

| 🌐 Telugu | 📍 Tirupathi, ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ACB సోదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పెద్దకాపు లేఅవుట్‌లోని ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ACB DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకేసారి మొత్తం ఐదు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు తిరుమలలోని ఆయన కార్యాలయం కూడా ఉన్నట్లు తెలుస

దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి ఫ్రెండ్స్ వైన్స్ షాప్‌లో రూ.20 లక్షలకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు యజమాని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సూపర్‌వైజర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంత మొత్తం నష్టం జరిగింది? ఆరోపణల్లో నిజమెంత? పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియాల్సి ఉంది.

మదర్ ఫౌండేషన్ మల్లవరం అధ్యక్షులుకి సోదరులు రాఖీ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మదర్ ఫౌండేషన్ మల్లవరం అధ్యక్షులుకి సోదరులు రాఖీ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలపరిధిలోని మల్లవరం గ్రామంలోపవిత్ర రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మదరఫౌండేషన్ మల్లవరం అధ్యక్షుడు జిల్లా బాబురావువారి సోదరులు ప్రేమతో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు మిఠాయిలు తినిపించి, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న తన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హుగ్గేల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

హుగ్గేల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన

| 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

హుగ్గెల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 30: శ్రీల ప్రభుపాదుల ఇస్కాన్ హుగ్గెల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆ గ్రామంలో పల్లె సంకీర్తన జనరంజకంగా సాగింది. గ్రామ హనుమాన్ మందిరం లో హరేకృష్ణ మహామంత్రాన్ని జపించిన అనంతరం ప్రభుపాదుల ప్రార్థన గీతంతో శోభయాత్రను ప్రారంభించారు. శ్రవణనందకరమైన కీర్తనలు ఆలపిస్తూ ఆనందోత్సాహల మధ్య నృత్యాలు చేస్తూ భగవదారాధనలో లీనమైపోయారు. గ్రామంలోని పురవీధులలో సంకీర్తన బృందాన్ని స్వాగతం పలుకుతూ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సంకీర్త

భక్తితోనే భగవద నుగ్రహం లభిస్తుంది విభీషణ ప్రబుజీ ఉవాచ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

భక్తితోనే భగవద నుగ్రహం లభిస్తుంది విభీషణ ప్రబుజీ ఉవాచ

| 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

భక్తితోనే భగవదనుగ్రహం లభిస్తుంది
---విభీషణ్ ప్రభుజీ ఉవాచ
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 30: భగవదనుగ్రహం పొందడానికి భగవంతుని పట్ల భక్తి ఉంటే చాలునని సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభుజీ పేర్కొన్నారు. 222వ నగర సంకీర్తనలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ హనుమాన్ మందిరంలో ఆదివారం భగవద్గీత కర్మయోగం శ్లోకాలపై ప్రభుజీ ప్రవచించారు. ఈ సందర్భంగా భగవద్గీత 3.2 శ్లోకంలోని అంతరార్థాన్ని భక్తులకు ఆయన విశదంగా వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడ

Dr. గొట్టిపాటి లక్ష్మీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

Dr. గొట్టిపాటి లక్ష్మీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!

| 🌐 Telugu | 📍 Darsi, Darsi, Andhra Pradesh

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. పార్టీ శ్రేణులకు శిక్షణ, కార్యకర్తలకు మార్గనిర్దేశం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ఆమె సేవలను సీఎం అభినందించారు. ఈ గుర్తింపు దర్శి టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

ఆర్టీసీ బస్సు మ్యాక్స్ వాహనం ఎదురెదురుగా ఢీ,, 8గాయాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఆర్టీసీ బస్సు మ్యాక్స్ వాహనం ఎదురెదురుగా ఢీ,, 8గాయాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి కల్వకుర్తికి వెళ్తున్న పెళ్ళి బస్సు ఎదురుగా వస్తున్న మ్యాక్సీ వాహనాన్ని పాలువాయి జంక్షన్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఢీకొనగా 8 మంది వ్యక్తులు గాయపడ్డారు. నూతన బస్సు డ్రైవర్‌కు అవగాహన లేక సర్వీస్ రోడ్డునే జాతీయ రహదారిగా భావించి డ్రైవ్ చేయడం ఈ ప్రమాదం జరగడానికి కారణం. గాయపడిన వారంతా ఎస్సీ కాలనీల్లో సోలార్ పలకలు ఏర్పాటు చేసే టెక్నీషియన్లు.. నాగరాజుతో పాటు మరో వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అటాస్తంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అటాస్తంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు

| 🌐 Telugu | 📍 Zheyrabad, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి,ఆగస్టు 27: జహీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పద్మశాలి భవన్ ప్రాంగణంలో పద్మశాలీయుల వ్యాఘ్ర పతాకాన్ని ఆ సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ ఎగురవేశారు. సంఘం కార్యవర్గ సభ్యులు, కులబాందవులు పద్మశాలీయుల గీతాన్ని ఆలపించారు. పిమ్మట మందిరం ప్రాంగణంలో వేద మంత్ర ఉచ్చారణల మధ్య హోమం నిర్వహించి

సెప్టెంబర్ 6న మహా పాదయాత్ర లోక కళ్యాణ్ రత్నంలో పాటు విశ్వశాంతిని
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

సెప్టెంబర్ 6న మహా పాదయాత్ర లోక కళ్యాణ్ రత్నంలో పాటు విశ్వశాంతిని

| 🌐 Telugu | 📍 Zhyrabad, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 27
లోక కళ్యాణార్థంతో పాటు విశ్వశాంతిని కోరుతూ తాలూకా వీరశైవ లింగాయత్ సమాజం, శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ వరకు 4 వ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తాలూకా వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు ఆగూర్ శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 4 వ మహా పాదయాత్ర సెప్టెంబర్ 6న ఉదయం 6.30 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని, ఇట్టి మహా పాదయాత్ర కార్యక్రమానికి గాను బడంపేట్ శ్రీ రాచన స్వామి ఆలయంలో గోడపత్రికను ఆవిష్క

చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం

| 🌐 Telugu | 📍 Chilakaluripet, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఈ విషాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#Palnadu #RoadAccident #Chilakalurip

5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని సత్రశాలపరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఆదివారం జరిగిన చోరీ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు తీవ్రంగా సీరియస్గా గా చర్యలు తీసుకుంటుందిగురజాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి దొంగల ఆచూకీ కనుగొనడంలో ఆరితేరిన ఐదుగురు నిపుణులైన పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలోకి దిగి నేరాలను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రేమ కథకు మరో విషాద ముగింపు!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రేమ కథకు మరో విషాద ముగింపు!

| 🌐 Telugu | 📍 సంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణ

సంగారెడ్డి: కుటుంబ విభేదాల కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిపై దాడి చేసి మరణానికి కారణమైన కేసులో ఆమె అరెస్టయ్యింది. ఇటీవల విడుదలైన అనంతరం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

ఉత్తమ డిటి అవార్డును పొందిన వెంకటరమణ ను సన్మానిస్తున్న వీఆర్వోలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఉత్తమ డిటి అవార్డును పొందిన వెంకటరమణ ను సన్మానిస్తున్న వీఆర్వోలు

| 🌐 English | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

విధి నిర్వహణే ప్రతిభకు గీటురాయని అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే లభిస్తాయని తహశీల్దార్ మర్రి దీప్తి అన్నారు. ఉత్తమ ఉద్యోగి అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న డిప్యూటీ తహశీల్దార్ వెంకట రమణ గౌరవార్థం మండల వీఆర్వోల సంఘం అధ్యక్షులు పల్లా రామకృష్ణ నేతృత్వంలో పాపారావు, విఘ్నేష్ , శంకర్ రెడ్డి, అరుణ, అశోక్, రెవెన్యూ కార్యాలయంలో దుశ్శాలవతో ఘనంగాసత్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలి, తహశీల్దార్ ఎం, దీప్తి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలి, తహశీల్దార్ ఎం, దీప్తి

| 🌐 English | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆధార్ కార్డు, జనన ధృవీకరణ, టెన్తాపాస్ సర్టిఫికెట్ జిరాక్స్ గ్రామ, వార్డు సచివాలయం,మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చే సుకోవాలని తహశీల్దార్ ఎం.దీప్తి కోరారు. గురువారం మండంలోని మల్లవరం గ్రామంలో ఓటరు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 22, 23, 29,30 తేదీల్లో ఓట్లు నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తగిన అ ర్హత పత్రాలకు సంబంధించి జిరాక్స్ కాపీలను బీఎల్వోలకు అందచేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్

విశాఖలో స్కూల్‌లో విషాద ఘటన.. విద్యార్థి మృతి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

విశాఖలో స్కూల్‌లో విషాద ఘటన.. విద్యార్థి మృతి

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో LKG విద్యార్థి ప్రణయ్ తేజ్‌ (6) తీవ్ర భయాందోళనకు గురై తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి మృతికి కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గి లో డ్రంక్ అండ్ డ్రైవ్,,రూ.10వేలు జరిమానా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

దుర్గి లో డ్రంక్ అండ్ డ్రైవ్,,రూ.10వేలు జరిమానా

| 🌐 English | 📍 దుర్గి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

దుర్గి లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన పట్రా శ్రీకాంత్ బాబుకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా దుర్గి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బి.గోపాల్ హెచ్చరించారు.

విద్యార్థులకు మదర్ ఫౌండేషన్ మల్లవరం ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

విద్యార్థులకు మదర్ ఫౌండేషన్ మల్లవరం ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిలు ఫౌండేషన్, అధ్యక్షులు జిల్లా బాబు రావు ఉపాధ్యక్షులు, జినుగువీర రాఘవులు పాల్గొన్నారు విద్యార్థులు ఆటల పోటీలలోవిజేతలకుపెన్నులు,స్కేలు,సీల్డ్,మెడల్స్, పెన్సిల్లు, విద్యార్థులకు కావాల్సినవి ఫౌండేషన్ వారు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అమలా బాబు ,రత్నబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సౌస్వతంత్ర దినోత్సవ ఎగిరిన జాతీయ జెండా పీఠం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

సౌస్వతంత్ర దినోత్సవ ఎగిరిన జాతీయ జెండా పీఠం

| 🌐 English | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

సౌస్వసంత్ర దినోత్సవ జహీరాబాద్ మండల్ కాంసెన్సీ ఫారెస్ట్ ఆఫీస్
రేంజ్ ఆఫీసర్ ఏ శ్యాంసుందర్రావు ఎస్ఐ అందరూ కలిసి జాతీయ జెండా పండుగ సందర్భంగా నిర్వహించుకున్నారు

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పథకం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పథకం

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పతాకం
జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి, ఆగస్టు 15: జహీరాబాద్ ఇరిగేషన్ కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న స్వాతంత్ర దేశ సార్వభౌమాత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగ

పెద్దదొడ్డి మహిపాల్ అంటే కౌన్సిలర్ హూ తికే
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పెద్దదొడ్డి మహిపాల్ అంటే కౌన్సిలర్ హూ తికే

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

మహిపాల్ అంటే కౌన్సిలర్.
అందరూ కౌన్సిలర్ల కంటే ఒకే ఒక్కడు.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15. జహీరాబాద్ నియోజకవర్గంలో 37 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్కడుగా అన్ని తానై ముందడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యేతో అన్ని తానై ఉండి ముందుకు సాగుతున్నారు.

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ వై నరోత్తం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ వై నరోత్తం

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యo కోసం పోరాడిన మహానియుల త్యాగాలను స్మరించు కుంట

1947 ఆగస్టు 15.. స్వాతంత్ర్య భారత తొలి ఉదయం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

1947 ఆగస్టు 15.. స్వాతంత్ర్య భారత తొలి ఉదయం

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

🇮🇳 1947 ఆగస్టు 15.. భారత చరిత్రలో మరచిపోలేని తొలి స్వాతంత్ర్య ఉదయం. ఢిల్లీలో లక్షలాది మంది ఉత్సాహంగా వేడుకలు వీక్షించారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరిన క్షణం దేశ ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. ఆనందంతో పాటు విభజన విషాదం వెంటాడినా.. ఆ రోజు స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. #IndependenceDay #India1947

వైసిపి నేత చెన్నారెడ్డి హత్య కేసులో నలుగురు అరెస్టు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వైసిపి నేత చెన్నారెడ్డి హత్య కేసులో నలుగురు అరెస్టు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

జిల్లా యువజన విభాగం నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య కేసులో ప్రధాన పురోగతి లభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు, ఆధిపత్యపోరుతోనే దారుణం డిఎస్పి మహేశ్వర రావు తెలిపారు

భారత చిత్రపట ఆకృతిలో బాలవికాస్ విద్యార్థులు విన్యాసాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

భారత చిత్రపట ఆకృతిలో బాలవికాస్ విద్యార్థులు విన్యాసాలు

| 🌐 Telugu | 📍 రెంచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలం కేంద్రంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు వినూత్న రీతిలో అలంకరించారు బాలికాస్ విద్యా సంస్థల చైర్మన్ అల్లం ఇన్నారెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులంతా కలసి భారతదేశ చిత్రపట ఆకృత నిలబడి దేశభక్తిని చాటుకున్నారు చేతుల్లో జాతీయ జెండాలు, దేశభక్తి తో పాఠశాల ప్రాంగణం మారుమోగింది.

ஸ்டான்லி மருத்துவமனையில் அதிர்ச்சி... வெளியான காட்சி!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ஸ்டான்லி மருத்துவமனையில் அதிர்ச்சி... வெளியான காட்சி!

| 🌐 Tamil | 📍 తమిళనాడు

விளக்கம்: சென்னை ஸ்டான்லி அரசு மருத்துவமனையில் நோயாளிகளுக்கான வேகவைத்த முட்டைகள் சரியான முறையில் வழங்கப்படாமல், படுக்கைகளின் அருகில் வைக்கப்பட்டதாகக் கூறப்படும் வீடியோ சமூக வலைதளங்களில் வேகமாக பரவி வருகிறது. இந்த விவகாரம் கவனத்திற்கு வந்ததைத் தொடர்ந்து, சம்பவத்தின் உண்மை நிலையை அறிய சுகாதாரத் துறை அதிகாரிகள் விசாரணையை தொடங்கியுள்ளனர்.

‘Hi’ మెసేజ్.. రూ.5 లక్షల హెల్త్ కవర్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

‘Hi’ మెసేజ్.. రూ.5 లక్షల హెల్త్ కవర్!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకం కింద అర్హత ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆసుపత్రి చికిత్సకు ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో నగదు రహిత వైద్యం అందించే సదుపాయం ఉంది. అయితే ‘రూ.5 లక్షల ఇన్సూరెన్స్’ అందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు.. అర్హత తప్పనిసరి. దీనికోసం ‘ఆయుష్మాన్ సారథి’ మొబైల్ నంబర్ +91 72908 23838కు వాట్సాప్‌లో ‘Hi’ లేదా ‘Hello’ అని మెసేజ్ చేయండి.

వర్షాలపై భారీ అలర్ట్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వర్షాలపై భారీ అలర్ట్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

అమరావతికి బిగ్ బూస్ట్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

అమరావతికి బిగ్ బూస్ట్!

| 🌐 Telugu | 📍 అమరావతి, అమరావతి, ఆంధ్రప్రదేశ్

అమరావతిని ఆధునిక సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త అవకాశాలు, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగనుంది.

ఉరవకొండలో ఉద్రిక్తత! వైసీపీ కార్యకర్తల హంగామా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఉరవకొండలో ఉద్రిక్తత! వైసీపీ కార్యకర్తల హంగామా

| 🌐 Telugu | 📍 ఉరవకొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం రోడ్డుపై ఆక్సిజన్‌ సిలిండర్లు, బండలు అడ్డంగా పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విశ్వేశ్వరరెడ్డిని తరలించారు. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

ఎక్సైజ్ ఉత్తర్వులకు విరుద్ధంగా బార్ యజమాన్యాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఎక్సైజ్ ఉత్తర్వులకు విరుద్ధంగా బార్ యజమాన్యాలు

| 🌐 Telugu | 📍 Zhd, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీ, శాఖ నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జహీరాబాద్ పట్టణంలోని కొన్ని బార్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సితార రెస్టారెంట్ అండ్ బార్కు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ సామాజిక కార్యకర్త పబ్బతి సంతోష్ కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

(ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేడు రెంటచింతలలో పర్యటించనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు చపరపు అబ్బిరెడ్డి చెప్పారు.సర్, లో చురుకుగా పాల్గొని దొంగ ఓట్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్లు)లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్టీ నేతలు అనుబంధాల సంఘాల అధ్యక్షులు తప్పని సరిగా రావాలని కోరారు

ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: గతనెల 31న విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాలో అభ్యంతరాలుంటే నేటి నుంచి బీఎల్ఏలే ఆర్జీలను స్వీకరించనున్నట్లు తహశీల్దార్ మర్రి దీప్తి చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ 13 రకాల ప్రభుత్వ గుర్తింపుకార్డుల్లో ఏదొఒకటి చూపించి ఓటర్లను నిర్ధారించుకోవడానికి అవకాశం ఉందన్నారు. సర్.లోభాగంగా మండల వ్యాప్తంగా వివరాలు లేని 4000 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని ప్రస్తుతం 36064 మంది ఓటర్లున్నారన్నారు.

జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్‌ ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 12 నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు, నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్లే గారు, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు మంగళవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి.ఆయన స్వగ్రామం అయినా చిక్కుర్తి గ్రామం, న్యాల్కల్ మండలం నుండి యువత అందరు కలిసి ఆయన పుట్టినరోజున నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నవోదయ సిద్ధార్థ మాట్లాడుతూ.

టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ చౌహాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మెగుర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
చౌహాన్ సురేష్, రాథోడ్ సురేష్, చౌహాన్ వారం, చౌహాన్ గోపాల్, చౌహాన్ శివరామ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ధనుష్‌పై.. విజ‌య్‌ సర్కారు నిఘా

| 🌐 Telugu | 📍 Chennai, తమిళనాడు

హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజ‌య్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో అప్రమత్తమైన సర్కారు ధనుష్, ఆయన అభిమాన సంఘాలు చేపట్టే సంక్షేమ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి నిఘా వర్గాలు అందించిన నివేదిక మేరకు.. హీరో ధనుష్ యువతను లక్ష్యంగా చేసుకుని, ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు టికే కోవై జిల్లాలోని పది నిజయోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రారంబించారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య

| 🌐 Telugu | 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో
కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య
అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు
గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్యకు గల కారణాలపై పోలీసుల ఆర తీస్తున్నారు
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య

| 🌐 Telugu | 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో
కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య
అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు
గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్యకు గల కారణాలపై పోలీసుల ఆర తీస్తున్నారు
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

రెంటచింతలలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రెంటచింతలలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటిచింతల మండల కేంద్రంలోని ఆదివారం,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ప్రసంగం: విద్యావేత్త నారాయణపురం శ్రీనివాసరావు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసి నేతల పాత్రను వివరించారు.పాల్గొన్నవారు: ప్రిన్సిపాల్ ఎస్.మోహన్, వైస్ ప్రిన్సిపాల్ భాగ్యమేరి, కృష్ణానాయక్, ఎమ్‌ఎల్‌ఆర్ ఫౌండేషన్ మేనేజర్ కల్యాణ్, ఉపాధ్యాయులు, మరియు తల్లిదండ్రులు ఈ కార్య

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?

| 🌐 Telugu | 📍 పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రాజకీయ సంచలనం సృష్టించిన రెంటచింతల మండలానికి చెందిన వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక పోలీసు బృందాలు వేగవంతం చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జక్కిరెడ్డి జ్యోతి రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైయస్ ఆర్ పార్టీనుంచి ఇద్దరు సస్పెండ్,, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వైయస్ ఆర్ పార్టీనుంచి ఇద్దరు సస్పెండ్,, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

| 🌐 Telugu | 📍 మాచర్ల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

చెన్నారెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నవులూరి అశోక్ రెడ్డి, మోర్తాల ఉమామహేశ్వర రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు YCP పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించబోమని ప్రోత్సహించే వారిని సహించేది లేదని అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ఎం ఎంఎల్ఆర్ ఫౌండేషన్ చేయూత 18 మంది బెస్ట్ టీచర్ అవార్డు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఎం ఎంఎల్ఆర్ ఫౌండేషన్ చేయూత 18 మంది బెస్ట్ టీచర్ అవార్డు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల సెయింట్ జోసెఫ్ పాఠశాల లో ఫౌండేషన్ 5 వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినకార్యక్రమాలో వివిధ పాఠశాలకు 50 కంప్యూటర్స్ ను ఉచితంగా అందించడంతోపాటు కంప్యూటర్ టీచర్సనుఏర్పాటు చేయటం అభినందనీయమని పలువురు కొనియాడారు వివిధ రకాల పోటీలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నాగదు జ్ఞాపికలను అందించడంతోపాటు 18 మంది టీచర్లను బెస్ట్ టీచర్ అవార్డులకు ఎంపిక చేసి రూ.2 లక్షల నగదును ప్రశంసాపత్రాలను అందజేశారు కార్యక్రమంలో ఎం ఎల్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులుపాల్గొన్నారు

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

విద్య ద్వారానే సామాజిక సమానత్వం, విద్య లక్ష్యం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

విద్య ద్వారానే సామాజిక సామానుత్వా లభిస్తుందని నేటి పోటి ప్రపంచంలో విద్య లేకపోతే మనుగడ లేదని దళితుల పేద వర్గాల ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తల్లూరి అమర్నాథ్ తెలిపారు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన బాలబాట సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజనల్ కోఆర్డినేటర్ ఆర్, సీ ఓపి ప్రసాద్ మాట్లాడుతూ బాలభాటలు నాలుగు అంశాలతో పెరటి తోట పెంపకం పచ్చదనం పరిశుభ్రత ఆటపాటలతో విద్య స్వయం సహాయక జీవన విధానంతో విద్యను అందిస్తుందని తెలిపారు

రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, : శుక్రవారం మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న రైలు కింద సాయంత్రం నా లుగున్నర గంటల సమయంలో పడ్డ వ్యక్తి గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన షేక్ ఈసోబగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఈసోబు ఎడమ చేయి పూర్తిగా విరిగిపోయి రైలు పట్టాల మధ్యన ప డిపోయింది. గురజాల రైల్వే స్టేషన్ వచ్చిందనుకుని రెంటచింతలలో దిగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఈసోబును 108లో గురజాల ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి నరసరావుపేటకు తర లించారు.

పరాశక్తి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ఎంఎస్ఎన్ రాజు 510 విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పరాశక్తి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ఎంఎస్ఎన్ రాజు 510 విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలన్నా ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నా విద్యే మూలమని ప్రతి ఒక్కరూ చదువుకుని గొప్పస్థితిలోకి రావాలని పరాశక్తి సిమెంట్స్ వైస్ ప్రసిడెంట్ ఎంఎస్ఎన్ రాజు కోరారు.. శుక్రవారం మండలంలోని మల్లవరం, జెట్టిపాలెం, పశర్లపాడు, గోలి తదితర గ్రామాల్లోని ప్రభత్వ పాఠశాలల్లో 510 మంది బాల బాలికలకు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎం. రామకృష్ణారెడ్డి, డీజీఎం జి.మల్లిఖార్జునరావు, కె.వేణుగోపాలరెడ్డి, హెచ్ఎంలు అమలబాబు, ఎం.సీతారావమ్మ, రూతమ్మ, స

ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు

| 🌐 Telugu | 📍 కారంపూడి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కారంపూడి శివారులో యువతి షేక్ హసీనా (25) హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తులో, ఐదేళ్ల ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అనుమానాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన హసీనాను కారంపూడికి పిలిపించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిలుగు బాల సైదులును చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు

అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రత్యర్థులపై పెద్దఎత్తున అరాచకాలు, వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ నేతలే, ఇప్పుడు రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

ప్రకాశం:ఆన్‌లైన్ స్కీమ్‌పై బాధితుల ఆరోపణలు!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రకాశం:ఆన్‌లైన్ స్కీమ్‌పై బాధితుల ఆరోపణలు!

| 🌐 Telugu | 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ ఆన్‌లైన్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్ ద్వారా పలువురు మోసపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో లాభాలు చెల్లించి నమ్మకం కల్పించిన నిర్వాహకులు, తర్వాత డబ్బుల ఉపసంహరణ నిలిపివేశారని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాతా యాక్టివ్ చేయాలంటే మరో రూ.7 వేలు చెల్లించాలని యాప్‌లో సందేశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఇంటికి సంక్షేమము అభివృద్ధి  ధ్యేయంగా ప్రభుత్వంలక్ష్యం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రతి ఇంటికి సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వంలక్ష్యం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలం, మల్లవరం గ్రామంలో కూటమి పార్టీల శ్రేణులు నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం.., ప్రతి ఇంటికిఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు..! రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించిన కరపత్రాలను అందజేసి, ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందుతున్న సంక్షేమం, రెండేళ్ల సుపరిపాలన గురించి ప్రజలకు వివరించడం జరిగినది..! ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు

వైసీపీలో రాజీనామా కలకలం!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వైసీపీలో రాజీనామా కలకలం!

| 🌐 Telugu | 📍 నెల్లూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి కొనసాగుతోంది. బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు తన పదవికి, రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో పార్టీ అధినేత ఫొటో ఎదుటే ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం పనిచేసినా ఆశించిన గుర్తింపు, గౌరవం లభించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!

| 🌐 Telugu | 📍 AP, AP, ఆంధ్రప్రదేశ్

AP: తల్లికి వందనం పథకంలో ఇంకా సాయం అందని అర్హులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అభ్యంతరాలు, ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా NPCIతో లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హుల ఖాతాల్లో సాయం జమ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇండిగో బంపర్ ఆఫర్... ఫ్రీ టికెట్లు!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఇండిగో బంపర్ ఆఫర్... ఫ్రీ టికెట్లు!

| 🌐 Telugu | 📍 Delhi, Delhi, ఢిల్లీ

20 ఏళ్ల కార్యకలాపాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండిగో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 6 మధ్య సంస్థ అధికారిక బుకింగ్ ఛానెళ్ల ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసిన అర్హులైన ప్రయాణికుల్లో ఎంపికైన వారికి మొత్తం 20,000 ఉచిత టికెట్లను అందించనుంది. అలాగే నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా రూ.10,000 వరకు టికెట్ మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్

| 🌐 Telugu | 📍 TS-AP, TS-AP, ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, ప్రయాణికులు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?

| 🌐 Telugu | 📍 AP, Amaravathi, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి ప్రధాన అడ్డంకులు లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎన్నికల ఏర్పాట్ల పురోగతిపై అన్ని జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్‌ల ప్రాతిపదికన నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహద పడతాయి అద్దంకి సీఐ సుబ్బరాజు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహద పడతాయి అద్దంకి సీఐ సుబ్బరాజు

| 🌐 Telugu | 📍 అద్దంకి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అద్దంకి సీఐ సుబ్బరాజుతెలిపారు సింగర్ కొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో బుధవారం సిఐ సుబ్బరాజు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు

అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!

| 🌐 Telugu | 📍 Addanki, Prakasam, ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో REMZకు వేగం
అద్దంకిలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భూములు ఇచ్చిన రైతులకు రూ.31.57 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తైతే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

తుమృకోట పాఠశాలల్లో నేడు శతాబ్ది ఉత్సవాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తుమృకోట పాఠశాలల్లో నేడు శతాబ్ది ఉత్సవాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల: పల్నాట చారిత్రక ప్రసిద్ధి చెందిన
తుమ్మకోటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశా ల నేడు నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలకు సిద్ధ మైంది. నేటి ఉత్సవాలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరా యలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, డీఈవో రామారావు, ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో 1967 ఆగస్టు 4న కృష్ణా నదిపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బహుళార్థక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన నాగార్జునసాగర్ ఆనకట్టను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికీ విశేషంగా దోహదపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది

వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

వర్గపోరుకు దూరంగా ఉండాలని గురజాల డీఎస్పీ బీ.మహేశ్వరరావు కోరారు. మండ లంలోని తుమ్మకోట లో పర్యటించి గ్రామస్తు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్ని
కల్లో ఎవరు ఓటు వారు వేసుకోవాలని అశాం తిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. చెప్పుడు మాటలు విని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కారం పూడి సీఐ ఆవుల భాస్కర్,ఎస్ఐ సీహెచ్ నాగా ర్జున తదితరులున్నారు.

విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల ,మండలం జెట్టిపాలెం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో విద్యా కమిటీ చైర్మన్ పేరును తొలగించడంపై వివాదం చెలరేగింది. ఆగస్టు 2న ప్రారంభించిన ఈ హాస్టల్ భవన శిలాఫలకంలో మంత్రులు, ఎమ్మెల్యే, అధికారుల పేర్లు ఉండగా, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దావులూరి రాజేష్ విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయన పేరు లేకపోవటంతో చర్చనీయాంశమైంది. ఈ విషయమై మాజీ మహాజన సోషలిస్టు పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు, ఆది ఝాంభవ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం లి. అధ్యక్షులు గడ్డిపర

విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఆటవీ సంపదను కాపాడడం భావితరాలకు స్వచ్ఛమైన వాతవారణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒ క్కరూ వ్యవహరించాలని మంచికల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం షిలార్ అన్నారు. మాడుగుల రిజర్వ్ ఫారెస్ట్లో బీట్ ఆఫీసర్ మనో మనోజ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు, గ్రామస్తులంతా కలసి విత్తన బంతుల పంపిణీ, విసిరే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో చేపట్టారు. పచ్చదనం పెంపే ధ్యేయంగా పెట్టుకోవాలని మొక్కల ఆకులకు మేఘాలను ఆకర్షించే స్వభావం వుంటుందని పేర్కొన్నారు. తక్కువ సమయంలో తక్కువ వ్య యంతో కొండలు, గుట్టల్లో భారీ మొక్కలు పెరి

కారంపూడి, నూతన సీఐ,ను సన్మానిస్తున్న మండల టిడిపి నేతలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

కారంపూడి, నూతన సీఐ,ను సన్మానిస్తున్న మండల టిడిపి నేతలు

| 🌐 Telugu | 📍 కారంపూడి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం
తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని కారంపూడి నూతన సీఐ, ఆవుల భాస్కర్ ఆన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు అబ్బిరెడ్డినేతృత్వంలో పలువు రు నేతులు ఆదివారం నూతన సీఐ, భాస్కర్ ను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పెండింగ్ కేసుల ప రిష్కారానికి కృషి చేస్తానని మండలంలోని ప్రతి గామాన్ని సందర్శించి లా అండ్ ఆర్డర్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను అవగతం చేసుకుని పరి ష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీన

పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

(రెంటచింతల),,రాష్ట్ర ప్రభుత్వం 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని వెంటనే నియమించా లని యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు కోరారు. ఆదివారం రెంటచింతలలోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పీఆర్సీ ఏర్పాటుతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలను విడు దల చేయాలని ఉద్యోగులందరికి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎ లను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఎంతో కాలయా పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ కు చెందిన డాక్టర్ చిన్నమ్మ, నాసరయ్య, ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్లు అమలబాబు, లేళ్ల శ్రీనివాసరావు, సిలార్ తదితరులు పాల

ఎన్నికల తీరుపై విద్యార్థుల్లో అవగాహన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఎన్నికల తీరుపై విద్యార్థుల్లో అవగాహన

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రెంటచింతల మండల కేంద్రంలోని ఫాతిమా విద్యానికేతన్లో శనివారం మాక్ పోలింగ్ నిర్వహిం ! చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ ఏర్పాటు, ఓటర్ల జాబితా పరిశీలన, ఎడమ చేతికి సిరా గుర్తు వేయడం, ఓటరు స్లిప్పుల ; పంపిణీ, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ సిబ్బంది విధులు, బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, విజేతలు బాధ్యతలు చేపట్టే విధానం తదితర అంశాలను విద్యార్థులే ప్రత్యక్షంగా నిర్వహించి ఎన్నిక

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, మండలం ఆగస్టు 2 తేదీ న రెంటాల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ ఆది వారం జరగనుంది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూల కంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాను న్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత గొంటు గోపాలరెడ్డి విగ్ర హాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.2.25 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. గోలి గ్రామంలో రూ.1.93 కోట్ల వ్యయ మయ్యే పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయను న్నారు

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పలనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: మండలంలోని జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.1.90 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహం పనులు పూర్తి కావడంతో ఈనెల 2న (ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు అబ్బిరెడ్డి, ప్రిన్సిపాల్ కె. పాపయ్యలు చెప్పారు. శు క్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్న బాలికల కల సాకారం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో 25 గదులు నిర్మించడం వల్ల 100 మంది బాలికలు ఉండే అవకాశం ఉంది. 4.5 ఎ కరాల విస్తీర్ణంలో వున్న ఈ పాఠశ

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పలనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: మండలంలోని జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.1.90 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహం పనులు పూర్తి కావడంతో ఈనెల 2న (ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు అబ్బిరెడ్డి, ప్రిన్సిపాల్ కె. పాపయ్యలు చెప్పారు. శు క్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్న బాలికల కల సాకారం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో 25 గదులు నిర్మించడం వల్ల 100 మంది బాలికలు ఉండే అవకాశం ఉంది. 4.5 ఎ కరాల విస్తీర్ణంలో వున్న ఈ పాఠశ

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై లోకేష్ హైలైట్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై లోకేష్ హైలైట్!

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విమానాశ్రయం ప్రాంతానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. మెరుగైన రవాణా అనుసంధానంతో పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధిలో కీలక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం ముగియడంతో శు క్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను తహశీల్దార్ మర్రి దీప్తి విడుదల చేశారు. ఆగస్టు 30 వరకు ఓటర్ల చేర్పులకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను బీఎల్వోలు స్వీకరించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తామన్నారు ఆక్టోబరు 3 వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఇప్పటి దాకా రెంటచింతల మండలంలోని 11 గ్రామాలు,132 వార్డులు,50 పోలింగ్ బూత్లకు సంబంధించి 40674 మంది ఓటర్లుండగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 36.064 మంది వున్నారు. డబుల్ ఎంట్రీ,

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఉన్న ఓట్లను తొలగించకుండా నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ఓటును వి నియోగించుకోవటానికి అవకాశం కల్పించిన టీడీపీకి చెందిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్స్) లు చేసిన కృషి ప్రశంసనీయమని పార్టీకీ వారే పునాదులని టీడీపీ మండల అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి అన్నారు .. మండ ల కేంద్రమైన రెంటచింతలలోని మానస నర్సరీలో మండల స్థాయి బీఎల్ ఏల విస్తృత స్థాయి సమావేశంలో అబ్బిరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహం, ఊపుతో ముందుకెళ్ళాలని కోరారు.గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుని

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

వర్షాకాలం ప్రారంభమైనందున ఎగువన వున్న నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటిక ప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్ తిరుమల ప్రసాద్ ఇంజనీరింగ్ సి బ్బందిని ఆదేశించారు. గురువారం సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. క్రస్ట్ గేట్లు, రిజర్వాయర్లో వున్న నీటి నిల్వ,మెయిన్ డ్యాం, పవర్ హౌస్లోని టర్తైయిన్లను తనిఖీ చేశారు. ఎస్ఈ ,కె. వెంకట

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు (CBI Raids) నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!

| 🌐 Telugu | 📍 Vizag, ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో రవాణా, పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ వద్ద సూట్‌కేసులో లభ్యమైన మృతదేహాన్ని విశాఖకు చెందిన యువతి సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

శుక్రవారం ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో దర్శి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీవో విజయ జ్యోతి తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. కార్యక్రమానికి సహకరించిన గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి

గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, మండలంలోని రెంటాల గ్రామ రైతు సింగు వెంకయ్యకు చెందిన గోమాత
ఒకే కాన్పులో రెండు కోడేదూడలకు జన్మనిచ్చి అందర్ని అబ్బురపరిచింది. ఈఘటన గ్రామంలో అందరికి తెలియడడం తో గ్రామస్తులంతా ఆ లేగ దూడలను చూసేందకు క్యూ కట్టారు. అనంతరం గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు చే శారు. ఇటీవలి కాలంలో అరుదైన సంఘటన జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పశువైద్యాధికారులు డా క్టర్ దీపక్ నాగార్జున, సహాయకులు భాస్కర్, రమేష్ నాయక్ గోమాత సుఖమయ ప్రసవానికి దగ్గరుండి ప్రత్యేక వైద్యం అందించారు.

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం

| 🌐 Telugu | 📍 Kadapa, ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ రేపు పులివెందులకు వెళ్లనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు.

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

రేపు ముండ్లమూరులో భారీ స్థాయిలో ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమం జరగనుంది!జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు!
మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం!

ఏపీలో వర్షాలు.. 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలో వర్షాలు.. 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

| 🌐 Telugu | 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వాతావరణం మారే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలో వర్షాభావ పరిస్థితులు.. ఖరీఫ్‌పై ప్రభావం

| 🌐 Telugu | 📍 AP, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలో భారీ వర్షాలకు అవకాశం

| 🌐 Telugu | 📍 AP, AP, ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: తొలి ఏకాదశి పర్వదినం ముగిసిన తరువాత ఆషాఢ మాసాన్ని పురస్కరిం
చుకుని ఆదివారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సారే సమర్పించారు. మేజర్ పంచాయతీ రెంటచింతల ఆంజనేయస్వా మి మాణ్యానికి చెందిన భక్తులంతా ఎర్రటి ఎండలో తల్లికి బోనాలు సమర్పించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.ము ఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చీర, సారె, పసుపు, కుంకుమ అందించారు. కరువు దరి చేరకూ డదని పాడి పంటలతో గ్రామాలు తులతూగాలని వరుణ దేవుడు కరుణించాలని వేడుకున్నారు. చల్లంగ దీవించాలని క రుణ కటాక్షాలు కుమ్మరించాలని ప్రార్ధించారు. పూజా

పంటలకు బీమా చేయించుకోవాలి..ఏవో కట్టా లక్ష్మారెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పంటలకు బీమా చేయించుకోవాలి..ఏవో కట్టా లక్ష్మారెడ్డి

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల...ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించి పంటలు నష్టపోయే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని నమోదు చేసుకోవాలని ఏవో కట్టా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం సాగు పరిస్థితులపై మాట్లాడుతూ బ్యాంక్. నుండి పంట రుణం తీసుకున్న వారికి బ్యాంక్ వారు బీమా ప్రీమియం చెల్లిస్తారని రుణం తీసుకోని రైతులు తమ ఆధా ర్ కార్డు, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, పంట ధృవపత్రాన్ని తీసుకుని ఆగస్టు 15వ తేదీ లోపు ప్రీమియం చెల్లించుకో వాలన్నారు. ఈయన వెంట ఏఈ

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రూ.73 కోట్ల ధాన్యం గోల్‌మాల్

| 🌐 Telugu | 📍 Suryapet, తెలంగాణ

సూర్యాపేట జిల్లా బాలెంలలోని వజ్ర రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యం మాయమైనట్లు తేలింది. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, మిల్లులోని నిల్వలను సీజ్ చేశారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ

| 🌐 Telugu | 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైంది. అయితే ఇందులో అడ్రస్ లేని వారు 44,89,488 మంది, మరణించిన వారు 15,22,174 మంది, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు 14,43,886 మంది ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు. అలాగే కొత్తగా 7,37,216 మంది ఓటర్లు నమోదయ్యారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

సహోద్యోగిని అతి కిరాతకంగా పొడిచి చంపిన యువకుడు!

| 🌐 Telugu | 📍 UP, UP, ఉత్తర ప్రదేశ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడనే కక్షతో ఓ యువకుడు తన సహోద్యోగిని కత్తితో పొడిచి హత్య చేశాడు. బరేలీకి చెందిన సురేశ్, అదే కంపెనీలో పనిచేస్తున్న బాబీతో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నరేశ్ మధ్య వివాదం ముదరడంతో ఈ ఘోరం జరిగింది. బాబీతో సురేశ్ ఎక్కువగా మాట్లాడటం సహించలేకపోయిన నరేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పల్నాడు,, విద్యుత్ ఘాతుకానికి ఒకరు మృతి

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మండాది గ్రామం, వెల్దుర్తి మండలం, .జక్కిరెడ్డి అంజిరెడ్డి (వయస్సు 40 సంవత్సరాలు), వృత్తిరీత్యా రైతు.: అడవి పందుల నివారణ కోసం పక్క పొలంలో ఏర్పాటు చేసిన కరెంటు తీగను ప్రమాదవశాత్తూ గురువారం రాత్రి తన స్వంత పొలంలోని ఆటోమేటిక్ మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణ సంఘటన జరిగింది.: కరెంట్ షాక్ తగలడం వల్ల అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.: ఇదే ప్రమాదంలో మరొక వ్యక్తికి కూడా విద్యుత్ షాక్ తగిలినప్పటికీ, అద

తొలి ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులసమావేశం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తొలి ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులసమావేశం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సత్ర శాలలోని శ్రీగంగాభ్రమరాంబ సమేత మల్లిఖార్జు నస్వామి సన్నిధిలో ఈ నెల 25న నిర్వహించ నున్న తొలి ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ జీవీ శివయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. సమావేశంలో తహసీల్దార్ మర్రి దీప్తి, రామిరెడ్డి, ఎస్ఐ సీహెచ్ నాగార్జున, డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి , ఏఈలు వెంకటేష్, మస్తాన్ వలి పాల్గొన్నారు

సచివాలయానికి తల్లికి వందనం జాబితా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

సచివాలయానికి తల్లికి వందనం జాబితా

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని ఆయా స్వర్ణ గ్రామ సచివాలయాల్లో తల్లికి వందనం ఆర్హులు, అనర్హులు జాబితాను
బహిరంగంగా నోటీస్ బోర్డ్లో అతికించినట్లు ఎంఈవో 2 శివనాగేశ్వరరావు చెప్పారు. జాబితాను పరిశీలించి రాని వారుంటే పాఠశాల హెచ్ఎంను సం ప్రదించాలన్నారు. బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్ సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలన్నారు. సాంకేతిక కారణాలతో నగదు ఆగిపోతే వెంటనే మీ పరిధిలోని సచివాలయ అధికారులతో సంప్రదించాలన్నారు.

తల్లికి వందనం ఒకే ఇంటికి రూ. 78వేలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

తల్లికి వందనం ఒకే ఇంటికి రూ. 78వేలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

AP: ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా 'తల్లికి వందనం' స్కీమ్ అమలు చేస్తుండటంతో పలు కుటుంబాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు సంతానం కాగా రూ.78వేలు అందాయి. నెల్లూరు, పల్నాడు, శ్రీసత్యసాయి ఇలా చాలా జిల్లాల్లో ఐదుగురు పిల్లలు ఉన్నవారికి రూ.65వేలు జమయ్యాయి. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో దశలో డబ్బులు అందనున్నాయి.

కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కోవిడ్.పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోలి పీహెచ్ సీ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు బుధవారం ఏఎన్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు ప్రజలుజాగ్రత్తగా మాస్క్ లు దరించాలన్నారురాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యం లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చేతులు పరిశుభ్రత, శ్వాసకోశ పద్ధతులను పాటిస్తూ అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో వున్నాయన్నారు. 3129 మార్చి 22 నుంచి కరోనా విజ్బంట్ స్తుండడంతో

గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.8 కోట్లతో 11 గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ ల నిర్మాణం ప్రారభమైనట్లు ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెన్ను వెంకటేష్ చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ ఓక్కో ఓవర్ హెడ్ ట్యాంక్ 40 వేల లీటర్ల స్థాయి నుంచి 2.50 లక్షల లీటర్ల సామర్థ్యంగల ట్యాం క్ నిర్మాణం జరుగుతుందన్నారు. రెంటచింతలకు 2, తుమృకోట 2, మంచికల్లు 2,రెంటాల 1, కొత్తగంగరాజు పల్లె 1,పాలువాయి 1,కొత్త పాలువాయి 1, పాలువాయిగేట్ 1, మిట్టగుడిపాడు 1, గోలి 1, మల్లవరం 1,పశర్లపాడు 1 మొత్తం 15 ట్యాంక్

‘తల్లికి వందనం’ నిధుల విడుదల
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

‘తల్లికి వందనం’ నిధుల విడుదల

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదల ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. చదువు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఆశయంతో ప్రభుత్వం తొలి విడత కింద 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15,000 కేటాయించగా, పాఠశాలల నిర్వహణ నిధి కింద రూ.2,000 మినహాయించి మిగిలిన రూ.13,000 నగదును తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తింపజేస్తుండటంతో గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా చేరిన విద

వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

జీతాలు పెంచాలని, శాశ్వితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులివ్వాలని, ప్రమాద బీమా క ల్పించాలని, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీప్స్ మంజూరు చేయాలని కోరుతూ మల్టీపర్పస్ ఎక్స్టెటెన్షన్ ఆఫీసర్లు మంగళవారం నుంచి పెన్ డౌ న్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డికి రాతపూర్వకంగా అభ్యర్ధనను అందించారు. ఈసందర్భంగా యూనియన్ నేత ఆ నిల్ మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనంతో బాధ్యతలు నిర్వహిస్తున్నామని అయినా తమ జీవితాల్లో ఎలాంటి పురోగతి లే దని వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం

ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ట్రాన్స్ఫారంలోని కాపర్ వైరు చోరీ

| 🌐 Telugu | 📍 Rentachintala, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మండలంలోని మంచికల్లు గ్రామానికి చెందిన నెవలి లింగారెడ్డి
పొలంలో వున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ అపహరణకు గురైంది. వర్షాలు లేక బోర్ ద్వారా వరి సాగు చేస్తున్నతరు ణంలో చోరీలు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.12 వేల వరకు నష్టం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున చెప్పారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మంత్రాలయం: కారు ప్రమాదంలో వ్యక్తి మృతి!

| 🌐 Telugu | 📍 Kurnool, ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం కుటుంబంతో కలిసి బయలుదేరిన రవిశెట్టి (43) అనే వ్యక్తి ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. బాధితులు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవిశెట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అ

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రచారంపై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రచారంపై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!

| 🌐 Telugu | 📍 Mumbai, మహారాష్ట్ర

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ 138 పరుగులతో అద్భుత సెంచరీ బాది విమర్శకుల నోళ్లు మూయించాడని గుర్తుచేశాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్, విరాట్‌లను జట్టు నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదని, వారు ఇంకా భారత జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ స్పష్టం చేశాడు.

రెంటచింతలో ఇరువురు ఘర్షణ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రెంటచింతలో ఇరువురు ఘర్షణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల,: మాచర్ల-దాచేపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహనాయక్‌కు, రెంటచింతల మండలం గోలికి చెందిన నాగేశ్వరరావు బంధువులకు కాలువ నీటి సరఫరా వ్యవహారంలో వివాదం ఉంది. ఓ రెస్టారెంట్ వద్ద టీ తాగుతూ కాలువ వ్యవహారాలపై చర్చిస్తుండగా వివాదం చెలరేగింది. నరసింహనాయక్ వర్గీయులు దాడి చేయడంతో నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తలలకు గాయాలయ్యాయి. వారిని గురజాల వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పర

చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

నటి అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ గత మూడేళ్లుగా రహస్య ప్రేమాయణం నడిపి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల నడుమ, ధ్రువ్ వైఖరి నచ్చక వారిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తి హఠాత్తుగా విడిపోయారనే ప్రచారం కోలీవుడ్, టాలీవుడ్‌లలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది; చివరిసారిగా కలుసుకున్న సమయంలో జరిగిన తీవ్ర వాగ్వాదంలో అనుపమ కోపంతో ధ్రువ్‌ను చెప్పుతో కొట్టి మరీ బ్రేకప్ చెప్పేసిందనే రూమర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతుండగా, ఈ ఘోరమైన బ్రేకప్ డ్రామాపై ఇప్పటివరకు ఇరు వర్గాల న

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గాయపడిచికిత్సపొందుతున్న పికిలి బాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే

| 🌐 Telugu | 📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్

మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలన

గాయపడి  చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గాయపడి చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే

| 🌐 Telugu | 📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్

మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలన

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్

| 🌐 Telugu | 📍 సంగారెడ్డి, తెలంగాణ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం చింతలగట్టు గ్రామంలో శాంతి ఫౌండేషన్; ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ మరియు శాంతి ఫౌండేషన్ చైర్మన్ అయిన సిద్దు రావణ్.. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని దర్గా, చర్చి, పోచమ్మ దేవాలయాలను సందర్శించి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచారు. మన ఊరు - మన బిడ్డ అనే కార్యక్రమంలో భాగంగా, తన తల్లి శాంతమ్మ గారి జ్ఞాపకార్థం సిద్దు రావణ్ ఈ కార్యక్రమాలను చ

బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య

| 🌐 Telugu | 📍 కారంపూడి, ఆంధ్రప్రదేశ్

కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రేబ్బరపల్లి పెద్ద వెంకటయ్య కుటుంబానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య రూ. 20000 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం కారంపూడి లోని ఆర్&బి బంగ్లాలో వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ భరోసా కల్పి

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

TG: గోదావరి కాలుష్యంపై పూర్తి స్థాయి ఆడిట్‌

| 🌐 Telugu | 📍 తెలంగాణ

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ED: భూదాన్ స్కామ్‌లో ఈడీ విచారణకు ఐఏఎస్

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

| 🌐 Telugu | 📍 AP, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (సోమవారం) వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం పరివాహక ప్రాంతాల

రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

| 🌐 Telugu | 📍 పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం (జూలై 20) జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, సచివాలయ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అన్ని కేంద్రాల్లో కొత్తగా 'ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ (QR) కోడ్'ను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యాలయాలకు రాలేని వారు 1100 టోల్ ఫ్

ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి

| 🌐 Telugu | 📍 Rentachintala, ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలతో విద్యార్థులు జీవితా ల్లో వెలుగు ప్రసరిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని టీడీపీ రెంటచింతల టౌన్ అధ్యక్షులు ఎం. రాజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహంలో ఉండే స్టూడెంట్స్ కు దుప్పట్లు, ప్లేట్లు, స్వెట్టర్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వార్డెన్లు బేగ్, అరుణుమారిలు అధ్యక్షత వహించార . గురజాల ఏఎస్ డబ్ల్యువో టీవీ.సుజాత కుమారి మాట్లాడుతూ రెండు రోజుల్

ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, ఆర్ అండ్ బి రహదారిని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు అలాగే మైక్ పెట్టి రణగొణధ్వనులు సృష్టించే వారికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తనదైన శైలిలో సుతిమెత్తంగా హెచ్చరించారు.రహ దారికివీరువైపులా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ దాటి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదే పనిగా చిన్న స్పీకర్ల తో ధ్వని కాలుష్యం చేస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్కు అంతరాయడం కలిగించొద్దన్నారు. రహదారి విస్తరించడం వల్ల ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోవాలే క

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఆజాద్ పార్టీ తెలంగాణ స్టేట్ సీనియర్ లీడర్స్ సిద్దు రావణ్

| 🌐 Telugu | 📍 సంగారెడ్డి, తెలంగాణ

ఆజాద్ పార్టీ జహీరాబాద్ కాంసెన్సీ సీనియర్ నాయకుడు సిద్దు రావ ణ్. జహీరాబాద్ మండల్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి జులై 19
ఆజాద్ పార్టీ కన్వీనర్ గా అధ్యక్షుడిగా నియమితులైన సిద్దు రామన్ గారు

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

| 🌐 Telugu | 📍 Delhi, ఢిల్లీ

హిందూ మతం విడిచి క్రైస్తవం లేదా ఇతర మతాలు స్వీకరించిన వ్యక్తులకు రాజ్యాంగపరమైన ఎస్సీ (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో 2021లో జరిగిన ఒక దాడి కేసుకు సంబంధించి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతం స్వీకరించినందున అతనికి ఈ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసన

జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది.

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

| 🌐 Telugu | 📍 Pendurthi, ఆంధ్రప్రదేశ్

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అని

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

| 🌐 Telugu | 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి

| 🌐 Telugu | 📍 delhi, ఢిల్లీ

వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 22 ప్రకారం ‘క్లాస్‌-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్‌-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్‌-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

| 🌐 Telugu | 📍 Delhi, ఢిల్లీ

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!

| 🌐 Telugu | 📍 Polavaram, ఆంధ్రప్రదేశ్

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

fsbcvbvcb

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

vcbvcbvcb

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?

| 🌐 Telugu | 📍 Amaravati, ఆంధ్రప్రదేశ్

బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

హైదరాబాద్‌లో భారీ వర్షం - రోడ్లు జలమయం

| 🌐 Telugu | 📍 Hyderabad, తెలంగాణ

హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం

| 🌐 Telugu | 📍 Delhi, ఢిల్లీ

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీ సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దేశవ్యాప్తంగా సంబరాలు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏఐ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవం

| 🌐 Telugu | 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్

కృత్రిమ మేధస్సు సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. పంటల పర్యవేక్షణ, నీటి నిర్వహణ, కీటకాల గుర్తింపు వంటి పనులు ఏఐ ద్వారా సులభంగా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

📰
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఎన్నికల ఫలితాలు - కాంగ్రెస్ హ్యాట్రిక్

| 🌐 Telugu | 📍 Bengaluru, కర్ణాటక

తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

📰 1 / 170