చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం
పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఈ విషాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#Palnadu #RoadAccident #Chilakaluripet #BreakingNews #AndhraPradesh #TeluguNews #ViralNews #Accident #Guntur #Shorts