
1947 ఆగస్టు 15.. స్వాతంత్ర్య భారత తొలి ఉదయం
🇮🇳 1947 ఆగస్టు 15.. భారత చరిత్రలో మరచిపోలేని తొలి స్వాతంత్ర్య ఉదయం. ఢిల్లీలో లక్షలాది మంది ఉత్సాహంగా వేడుకలు వీక్షించారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరిన క్షణం దేశ ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. ఆనందంతో పాటు విభజన విషాదం వెంటాడినా.. ఆ రోజు స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. #IndependenceDay #India1947