Cyclone Alert: ఏపీకి తుఫాన్ ముప్పు! 49 గంటలు డేంజర్ బెల్స్
Cyclonic Storm Montha: Cyclone Alert: ఏపీకి తుఫాన్ ముప్పు! 49 గంటలు డేంజర్ బెల్స్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణ ద్వీపకల్పంలోని అనేక రాష్ట్రాలతో పాటు అప్రమత్తంగా ఉంది. ఇది అక్టోబర్ 28 మంగళవారం నాటికి ''మోంతా' తుఫాన్ అతి తీవ్రంగా రూపాంతరం చెందుతుంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిన తీవ్రవాయుగుండం మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది.
మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ప్రస్తుతానికి చెన్నైకి 770 కి.మీ, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతం రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులు వీస్తాయి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ. Date: 26-10-2025